కేంద్రం పన్ను తగ్గింపుతో దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్ ధర రూ.103.97కి చేరింది. ముంబైలో పెట్రోలు ధర లీటరుకు రూ. 109.98గా ఉంది. కోల్కతాలో సోమవారం లీటర్ పెట్రోల్ ధర రూ.104.67గా ఉంది. చెన్నైలో సోమవారం లీటర్ పెట్రోల్ ధర రూ.101.40గా ఉంది.
ఢిల్లీ ప్రభుత్వం ఇంధన ధరలపై ఎలాంటి వ్యాట్ తగ్గింపును ప్రకటించలేదు. కోల్కతాలో లీటర్ డీజిల్ ధర రూ.89.79గా, చెన్నైలో డీజిల్ ధర లీటరుకు రూ.91.43గా ఉండగా, మధ్యప్రదేశ్లోని భోపాల్లో లీటర్ డీజిల్ ధర రూ.90.87గా ఉంది.
అదనపు వ్యాట్ తగ్గించిన రాష్ట్రాలు/యూటీలు లడఖ్, కర్ణాటక, పుదుచ్చేరి, జమ్మూ & కాశ్మీర్, సిక్కిం, మిజోరాం, హిమాచల్ ప్రదేశ్, డామన్ & డయ్యూ, దాద్రా & నాగ్ర్ హవేలీ, చండీగఢ్, అస్సాం, మధ్యప్రదేశ్, త్రిపుర, గుజరాత్, నాగాలాండ్, పంజాబ్, గోవా, మేఘాలయ, ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, అండమాన్ & నికోబార్, బీహార్, ఉత్తరాఖండ్, ఉత్తర ప్రదేశ్, హర్యానా ఉన్నాయి.