రోజురోజుకి పెరుగుతున్న ఇంధన ధరల బాదుడు.. ఇక తగ్గేదే లే..?

Ashok Kumar   | Asianet News
Published : Oct 29, 2021, 11:58 AM IST

న్యూఢిల్లీ :  వరుసగా మూడోరోజు కూడా  అంటే ఆక్టోబరు 29న శుక్రవారం పెట్రోల్(petrol), డీజిల్(diesel) ధరలు దేశవ్యాప్తంగా మరోసారి రికార్డు స్థాయికి పెరిగాయి. అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు(crudeoil prices) పెరగడంతో చమురు మార్కెటింగ్ కంపెనీలు నేడు కూడా  ఇంధన ధరలను సవరించాయి. 

PREV
13
రోజురోజుకి పెరుగుతున్న ఇంధన ధరల బాదుడు.. ఇక తగ్గేదే లే..?

. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ప్రకారం దేశ రాజధానిలో పెట్రోల్ ధర  30 నుండి 37 పైసలు పెరిగి రూ.108.64 చేరగా , డీజిల్ ధర  35 పైసలు  పెరిగి రూ.97.37గా ఉంది.  తాజా పెంపు దేశ పౌరులను ఆందోళనకు గురిచేస్తోంది. ఇంధన ధరల పెంపు కారణంగా ఇప్పటికే ఇతర వస్తువుల ధరలు కూడా పెరిగాయి.

విమానయాన సంస్థలకు ఏవియేషన్ టర్బైన్ ఇంధనం (ATF లేదా జెట్ ఇంధనం) విక్రయించే ధర కంటే ఇప్పుడు పెట్రోల్ ధర 37.52% ఎక్కువ. ఢిల్లీలో ఏ‌టి‌ఎఫ్ ధర లీటరుకు దాదాపు రూ. 79.

23

ముంబైలో ఇప్పుడు లీటర్ పెట్రోల్ ధర రూ. 114.47, డీజిల్ ధర లీటరుకు రూ. 105.49. చెన్నైలో పెట్రోలు ధరల లీటర్‌కు రూ. 105 దాటి ప్రస్తుతం లీటరు ధర రూ. 105.43, డీజిల్ ధర రూ.101.59గా ఉంది. నాలుగు మెట్రో నగరాల్లో ఇంధన ధరలు ముంబైలో అత్యధికంగా ఉందని ప్రభుత్వ ఆయిల్ రిఫైనర్ తెలిపింది.

విలువ ఆధారిత పన్ను లేదా VAT ధరలు రాష్ట్రాల నుండి రాష్ట్రానికి మారుతున్నందున ఇంధన ధరలు ప్రతిరాష్ట్రానికి మారుతుంటుంది. తక్కువ వ్యాట్ కారణంగా దేశ రాజధానిలో ఇంధన ధరలు అత్యల్పంగా ఉన్నాయి.

ఇతర మెట్రో నగరాల్లో ఈరోజు పెట్రోల్ మరియు డీజిల్ ధరలు ఇక్కడ ఉన్నాయి:

నగరం      పెట్రోల్ ధర (రూ.లలో)      డీజిల్ ధర (రూ.లలో)
చెన్నై                   105.43                              101.59
కోల్‌కతా              109.12                                100.49
హైదరాబాద్        రూ. 113.00                       రూ.106.22

సోర్స్: ఇండియన్ ఆయిల్
 

33

ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం వంటి ప్రభుత్వ రంగ చమురు సంస్థలు అంతర్జాతీయ ముడి చమురు ధరలు, రూపాయి-డాలర్ మారకపు ధరలను పరిగణనలోకి తీసుకుని ప్రతిరోజూ ఇంధన ధరలను సవరిస్తాయి. పెట్రోల్, డీజిల్ ధరలలో ఏవైనా మార్పులు చోటుచేసుకుంటే ప్రతిరోజూ ఉదయం 6 గంటల నుండి అమలులోకి వస్తాయి.

ప్రస్తుతం  బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు $84.47గా ఉంది, ఇంతకుముందు ధర కంటే 0.10% పెరిగింది. కరోనా మహమ్మారి తర్వాత ఆర్థిక కార్యకలాపాలు పునఃప్రారంభించిన కారణంగా దేశాల అంతటా డిమాండ్ పెరుగుతూనే ఉండగా, గట్టి సరఫరా కారణంగా క్రూడ్ ధరలు పెరుగుతున్నాయి. డాలర్-రూపాయి మారకం రేటు కూడా స్థానిక ఇంధన ధరలపై ప్రభావం చూపుతుంది. ఉదయం 10:50 గంటల సమయానికి, ఒక డాలర్ 74.78 రూపాయల వద్ద ట్రేడవుతోంది.

click me!

Recommended Stories