వాల్యు ఆధారిత పన్ను (వ్యాట్), సరుకు రవాణా ఛార్జీలు వంటి స్థానిక పన్నుల ఆధారంగా ఇంధన ధరలు రాష్ట్రాల నుండి రాష్ట్రాలకు, నగరాల్లో కూడా మారుతూ ఉంటాయి. నివేదికల ప్రకారం రాజస్థాన్ దేశంలో అత్యధిక వ్యాట్ వసూలు చేస్తుంది, తరువాత మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ ఉన్నాయి.
గత సంవత్సర కాలంగా దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఎప్పుడూ లేనంతగా పెరిగిపోతున్నాయి. ఈ ప్రభావం సామాన్యులపై తీవ్రంగా పడుతోంది. గతేడాది ఏప్రిల్లో ముడి చమురు ధరలు జీవితకాల కనిష్ఠానికి చేరినా దేశంలో మాత్రం ఇంధన ధరలు తగ్గలేదు.