ఐపిఓ ఇష్యూ సైజ్ ఎంత?
ఐపిఓ తాజా ఇష్యూ ద్వారా రూ. 8,300 కోట్లను సమీకరించాలని ప్రయత్నిస్తుండగా ప్రస్తుతం ఉన్న వాటాదారులకు రూ. 10,000 కోట్ల ఆఫర్ ఫర్ సేల్ (OFS)ఉంటుంది. అలాగే దేశంలోనే అతిపెద్ద ఐపీఓ అవుతుందని భావిస్తున్నారు. అంతకుముందు 2015లో కోల్ ఇండియా ఐపీఓ రాగా, దాని నుంచి రూ.15,200 కోట్లు సమకూరాయి. పే త్రూ మొబైల్ని పేటిఎం అనే పేరుతో పిలువబడే కంపెనీ కొద్ది రోజుల క్రితం యాంకర్ ఇన్వెస్టర్ల నుండి రూ.8,235 కోట్లను సేకరించింది. కంపెనీ బ్లాక్రాక్, సింగపూర్కు చెందిన సిపిపిఐబి (CPPIB), అబుదాబికి చెందిన సావరిన్ వెల్త్ ఫండ్లను యాంకర్ పెట్టుబడిదారులుగా చేర్చుకుంది.