మైక్రో-బ్లాగింగ్ సైట్ ట్విట్టర్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO) జాక్ డోర్సే(jack dorsey) తన పదవికి సోమవారం రాజీనామా చేశారు. ఇప్పుడు అతని స్థానంలో భారత సంతతికి చెందిన పరాగ్ అగర్వాల్(parag agarwal) ట్విట్టర్ కొత్త సిఈఓగా నియమితులయ్యారు. పరాగ్ అగర్వాల్ ట్విట్టర్ (twitter)కొత్త సిఈఓగా బాధ్యతలు తీసుకున్న తర్వాత సోషల్ మీడియాలో అతనిపై అభినందనలు వెల్లువెత్తాయి.