ముఖేష్ అంబానీ మనవడి ఫస్ట్ బర్త్ డే.. ఇటలీ, నెదర్లాండ్స్ నుండి..సెలెబ్రిటిల వరకు.. హైలెట్స్ ఇవే..

First Published Dec 9, 2021, 2:57 PM IST

ఆకాష్ అంబానీ, భార్య శ్లోకా అంబానీ కుమారుడి పుట్టినరోజు వేడుక డిసెంబర్ 10 శనివారం సాయంత్రం జామ్‌నగర్‌లో జరగనుంది. అయితే ఈ బర్త్ డే (birthday)సందర్భంగా 100 మంది పూజారులు పృథ్వీ అంబానీ(prithvi ambani)ని ఆశీర్వదించనున్నారు. 

మరోవైపు బాలీవుడ్ తారలు రణబీర్ కపూర్, అలియా భట్ , దీపికా పదుకొనే, రణ్‌వీర్ సింగ్ , సచిన్ టెండూల్కర్  తో సహ మరికొంత మంది సెలెక్టెడ్ అతిథులు ఈ వేడుకకు హాజరవుతారని తెలుస్తుంది. అతిథులు ఈ పుట్టినరోజు కోసం అనుసరించాల్సిన భద్రతా ప్రోటోకాల్‌లను నోట్ ద్వారా పేర్కొంది. ఇందులో అతిథులందరికీ సెకండ్ డి‌ఓ‌ఎస్ వాక్సిన్ పొంది ఉండాలని సూచించింది. ఇది ఇలా ఉండగా ముంబయి వెలుపల ఉన్న అతిథులు డిసెంబర్ 7 నుండి  కరోనా టెస్ట్ రిపోర్ట్ వెల్లడించాల్సి ఉంటుంది. అతిథులు నివసించే నగరం నుండి ప్రైవేట్ జెట్‌లో జామ్‌నగర్‌కు వెళ్ళే  సదుపాయం కూడా కల్పించారు. ఇందుకు 10వ తేదీన ముంబై నుండి జామ్‌నగర్‌కు విమానాలు నిర్వహించనున్నారని అలాగే 11 వ తేదీన ముంబైకి తిరిగి వస్తుందని, జామ్‌నగర్‌లోని ఫ్యామిలీ గెస్ట్‌హౌస్‌లో అతిథులు ఉండేందుకు అవకాశం ఉందని కూడా పేర్కొంది.

అంతర్జాతీయ చెఫ్‌లు, నెదర్లాండ్స్ నుండి బొమ్మలు 
ఈ బర్త్ డే సెలెబ్రేషన్స్ లో  పిల్లల కోసం రూపొందించిన పెద్ద గేమ్ ప్లేస్  పూర్తిగా నిర్బంధించిన బబుల్ పార్టీగా చెప్పవచ్చు. శ్లోకా అంబానీ తన కుమారుడు పృథ్వీ అంబానీ పుట్టినరోజు కోసం నెదర్లాండ్స్ నుండి బొమ్మలను తెప్పించారు అలాగే ఇటలీ అండ్ థాయ్‌లాండ్‌కు చెందిన అంతర్జాతీయ చెఫ్‌ల బృందం ఈ వేడుకలో విందును సిద్ధం చేయనుంది. వేడుకకు సంబందించి కొందరి సమాచారం ప్రకారం “జామ్‌నగర్‌లోని అనాథాశ్రమాలకు బహుమతులు, బొమ్మలు కూడా పంపనున్నారు. అలాగే అంబానీ ఫామ్‌హౌస్ చుట్టూ నివసించే గ్రామస్తులందరికీ ఆహారం పంపాలని అంబానీ కుటుంబం ప్లాన్ చేసింది. త్వరలో మరిన్ని పుట్టినరోజు వేడుకల వివరాలను పోస్ట్ చేస్తాము అని తెలిపారు.

మీడియా నివేదికల ప్రకారం, పుట్టినరోజు వేడుకల కోసం 120 మంది అతిథులను ప్రైవేట్ జెట్ ద్వారా జామ్‌నగర్‌కు పంపనున్నారు. వీరిలో రణబీర్ కపూర్, అలియా భట్, సచిన్ టెండూల్కర్, జహీర్ ఖాన్, దీపికా పదుకొనే, రణవీర్ సింగ్, పార్థ్ జిందాల్ వంటి ప్రముఖ బాలీవుడ్ అండ్  క్రీడా ప్రముఖులు కూడా ఉన్నారు. పృథ్వీ అంబానీ పుట్టినరోజు సందర్భంగా సింగర్ అరిజిత్ సింగ్ ప్రదర్శన ఇవ్వనున్నారు.  

పృధ్వీ అంబానీ మొదటి జన్మదినం సందర్భంగా పరిసర జామ్‌నగర్‌ పరిసర గ్రామాల్లోని 50వేల గ్రామస్తులకు ఆహారం పంపిణీ చేసేందుకు కూడా అంబానీ ప్రణాళికలు చేస్తున్నారు. ఈ సందర్భంగా అనాథ శరణాలయాలకు బహుమతులు అందించాలని, పృథ్వీ జన్మదినాన్ని పురస్కరించుకుని భారతదేశంలోని 150 అనాథ శరణాలయాల్లో చిన్నపాటి వేడుకలను నిర్వహించాలని యోచిస్తున్నారు.
 

బర్త్ డే  అండ్ ప్లేయింగ్ ఏరియా కోసం బొమ్మలను శ్లోకా అంబానీ నెదర్లాండ్స్ నుండి దిగుమతి చేసుకున్నారు. చెప్పాలంటే  ఆకాష్ అంబానీ, భార్య శ్లోకా అంబానీ  ఇద్దరూ ఈ పార్టీని ప్లాన్ చేస్తున్నారు, ఒకవిధంగా ఈ ఈవెంట్ పూర్తిగా నిర్బంధలో ఉంటుంది. ఫుడ్ క్యాటరర్లు థాయ్‌లాండ్, ఇటలీ అండ్ ఇతర దేశాల నుండి రప్పించారు  అలాగే కఠినమైన నిర్బంధాన్ని అనుసరించాలని  కోరారు. ముఖేష్ అంబానీ మనవడు అంటే ఆకాష్ అంబానీ అతని భార్య శ్లోకా అంబానీల కుమారుడు ఆకాష్ అంబానీ10 డిసెంబర్ 2020న జన్మించారు.

బహుమతులు తీసుకురావద్దు
డిసెంబర్ 10న ముంబై నుండి  మరుసటి రోజు వరకు విమానాలు నిర్వహించబడతాయని అంబానీ తెలిపారు. ఫ్యామిలీ గెస్ట్‌హౌస్‌లలో ఉండేందుకు అతిథులు 0-5 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండాలని కోరారు. క్వారంటైన్‌లో ఉండకూడదనుకునే అతిథులకు ప్రత్యామ్నాయ వసతి కల్పించబడుతుంది. అలాగే బర్త్ డేకి బహుమతులు అవసరం లేదని, ఇందుకు బదులుగా ఈ డబ్బును విరాళంగా ఇవ్వాలని ఒక నోటీసులో పేర్కొన్నారు.

click me!