అక్టోబరు 27న షాదాబ్ ఖాన్ అనే వ్యక్తి పేరుతో ఈ-మెయిల్ మెసేజ్ వచ్చింది. ముంబైలోని ముఖేష్ అంబానీ నివాసం యాంటిలియాలోని భద్రతా సిబ్బంది అంబానీకి ప్రాణహాని ఉందని తమ దృష్టికి తీసుకురావడంతో ఫిర్యాదు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఫిర్యాదు మేరకు ముంబైలోని గామ్దేవి పోలీసులు గుర్తు తెలియని వ్యక్తిపై ఐపీసీ సెక్షన్ 387, 506 (2) కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.