LPG Price Hike : మళ్లీ పెరగనున్న ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరలు? అసలు కారణం ఇదే

Published : Aug 06, 2026, 12:01 PM IST

LPG Price Hike : భారత్‌లో ఎల్పీజీ సిలిండర్ ధర రూ.18 వరకు పెరిగే అవకాశం ఉంది. గ్యాస్ స్ట్రాటజిక్ రిజర్వుల నిధి కోసం పన్ను వసూలుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. దీని ప్రభావంతో ఇప్పుడు వంటింటి నిత్యావసరాల ఆర్థిక భారం మరింత పెరగనుంది.

PREV
16
సామాన్యులకు షాకింగ్ న్యూస్: మళ్లీ పెరగనున్న గ్యాస్ సిలిండర్ ధరలు

దేశంలో వంట గ్యాస్ ఉపయోగిస్తున్న సామాన్య ప్రజలకు త్వరలోనే మరో భారీ షాక్ తగిలే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే పెరిగిన నిత్యావసర ధరలతో ఇబ్బంది పడుతున్న సామాన్యులపై ఎల్పీజీ సిలిండర్ ధరల రూపంలో అదనపు భారం పడనుంది. అయితే ఈసారి అంతర్జాతీయ యుద్ధాల కారణంతో కాకుండా, ప్రభుత్వం కొత్తగా విధించబోయే పన్ను లేదా లేవీ వల్ల ఈ ధరలు పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి.

26
గ్యాస్ స్ట్రాటజిక్ రిజర్వ్ పెంపునకు ప్లాన్

పలు రిపోర్టుల ప్రకారం, దేశంలో ఇంధన భద్రతను బలోపేతం చేయడానికి కేంద్ర ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. ఇందులో భాగంగా ఎల్పీజీ, సహజ వాయువు (LNG/PNG) స్ట్రాటజిక్ నిల్వలను పెంచాలని చూస్తోంది. ఇరాన్ సంక్షోభం సమయంలో భారత్ గ్యాస్, ఆయిల్ సరఫరా సమస్యలను ఎదుర్కొంది. దీని నుంచి పాఠాలు నేర్చుకున్న ప్రభుత్వం, అత్యవసర సమయాల కోసం ఇంధన నిల్వలను పెంచేందుకు సిద్ధమైంది. ఈ వ్యూహాత్మక నిల్వల మౌలిక సదుపాయాల కోసం సుమారు 42 బిలియన్ డాలర్లు (రూ. 3.6 లక్షల కోట్లు) ఖర్చవుతుందని అంచనా. ఈ నిధిని వినియోగదారుల నుంచి టాక్స్ రూపంలో సేకరించాలని భావిస్తున్నారు.

36
సిలిండర్ ధర ఎంత పెరుగుతుంది?

ప్రభుత్వం విధించబోయే ఈ రుసుము వల్ల 14.2 కిలోల గృహ వినియోగ ఎల్పీజీ సిలిండర్ ధర సుమారు రూ.18 వరకు పెరిగే అవకాశం ఉంది. ప్రతి కేజీ ఎల్పీజీపై రూ.1.29 చొప్పున ఛార్జ్ విధించాలని ప్రతిపాదన ఉంది. దీని ద్వారా ఏటా 460 మిలియన్ డాలర్లు వసూలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. అలాగే పైప్‌లైన్ ద్వారా వచ్చే పీఎన్‌జీ గ్యాస్‌పై కూడా ప్రతి స్టాండర్డ్ క్యూబిక్ మీటర్‌కు రూ.1.43 వసూలు చేసే అవకాశం ఉంది. ఈ లేవీ వల్ల మొత్తంగా గ్యాస్ వినియోగదారుల బిల్లులో 2 శాతం వరకు పెరుగుదల ఉండవచ్చు.

46
భారత్ వద్ద నిల్వలు ఎంత ఉన్నాయి?

భారత్ తన చమురు అవసరాలలో 90 శాతానికి పైగా దిగుమతులపైనే ఆధారపడుతోంది. ప్రస్తుతం దేశంలో ఉన్న స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్ 5.33 మిలియన్ మెట్రిక్ టన్నులుగా ఉంది. ఇది కేవలం 9.5 రోజుల వినియోగానికి మాత్రమే సరిపోతుంది. రిఫైనరీలు, పోర్టులలో ఉన్న స్టాక్ కలిపితే మొత్తం 74 రోజుల బఫర్ స్టాక్ ఉంది. ఎల్పీజీ విషయానికి వస్తే 45 రోజులకు సరిపడా నిల్వలు ఉన్నాయి. రాబోయే 10 ఏళ్లలో చమురు నిల్వలను మరో 28 మిలియన్ టన్నులు, ఎల్ఎన్‌జీ నిల్వలను 9 మిలియన్ టన్నులు, ఎల్పీజీ నిల్వలను 4 మిలియన్ టన్నులకు పెంచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

56
ఇ-కేవైసీ చేయకపోతే సిలిండర్ నిలిపివేత?

ధరల పెంపుతో పాటు, ప్రభుత్వం గ్యాస్ వినియోగదారులకు మరొక కీలక నిబంధన విధించింది. ఆగస్టు 16 నాటికి బయోమెట్రిక్ ఆధార్ ఇ-కేవైసీ పూర్తి చేయని వినియోగదారులకు గృహ వినియోగ సబ్సిడీ గ్యాస్ సిలిండర్లను నిలిపివేస్తారని సమాచారం. తుది గడువులోగా ప్రక్రియ పూర్తి చేయకపోతే, ఇ-కేవైసీ పూర్తయ్యే వరకు 14.2 కేజీల సిలిండర్ గృహ ధరలలో లభించదు. ఇండియన్ ఆయిల్, హెచ్‌పీ, భారత్ గ్యాస్ వంటి అన్ని కంపెనీల వినియోగదారులకు ఇది వర్తిస్తుంది. సబ్సిడీ దుర్వినియోగాన్ని అరికట్టేందుకే ఈ చర్య అని ప్రభుత్వం చెబుతోంది.

66
ఇ-కేవైసీ పూర్తి చేయడం ఎలా?

గ్యాస్ వినియోగదారులు ఇ-కేవైసీని పూర్తి చేయడానికి మూడు సులువైన మార్గాలు ఉన్నాయి..

1. ఆన్‌లైన్ ద్వారా: గ్యాస్ కంపెనీల అధికారిక యాప్, ఆధార్ ఫేస్ ఆర్‌డీ యాప్ ఉపయోగించి స్వయంగా పూర్తి చేయవచ్చు.

2. గ్యాస్ ఏజెన్సీ వద్ద: మీ ప్రాంతంలోని సంబంధిత గ్యాస్ పంపిణీ ఏజెన్సీకి నేరుగా వెళ్లి బయోమెట్రిక్ ఇవ్వవచ్చు.

3. డెలివరీ బాయ్ ద్వారా: ఇంటికి గ్యాస్ సిలిండర్ తీసికొని వచ్చే డెలివరీ ఏజెంట్ల వద్ద ఉండే పరికరం ద్వారా కూడా ఇ-కేవైసీ పూర్తి చేసుకోవచ్చు.

Read more Photos on
click me!

Recommended Stories