ఇప్పుడు పెంచిన గ్యాస్ ధరలు నేరుగా హోటల్, రెస్టారెంట్ రంగంపై పడుతుంది. ఇప్పటికే కూరగాయలు, నూనె, పప్పులు, బియ్యం వంటి నిత్యావసర ధరలు పెరిగిపోయాయి. ఇప్పుడు గ్యాస్ ధరలు కూడా పెరుగుతాయి. కాబట్టి వారు అమ్మే టిఫిన్లు, భోజనాలు, టీ కాఫీల ధరలు పెరిగే అవకాశం ఉంది. వీటి భారం మళ్లీ ప్రజల మీదే పడుతుంది. ఇకరోడ్డు పక్కన ఫుడ్ స్టాల్, బండిపై హోటల్ పెట్టుకునే వారికి మాత్రం ఇది పెద్ద భారంగా మారే అవకాశం ఉంది. అయితే ఇంట్లో వంట చేసుకునే వారికి మాత్రం ఎలాంటి ప్రత్యక్ష ప్రభావం ఉండదు.