రూ. 400 తక్కువ ధరకే గ్యాస్ సిలిండర్: ఈ లిస్ట్ లో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి..

Published : Aug 30, 2023, 10:48 AM IST

న్యూఢిల్లీ: వంటగ్యాస్ ఎల్‌పీజీ సిలిండర్ల  ధరలను రూ.200 తగ్గిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం మంగళవారం ప్రకటించింది. అయితే ఉజ్వల పథకం కింద 75 లక్షల కొత్త కనెక్షన్లు ఇస్తామని ప్రభుత్వం తెలిపింది. అంటే ఇప్పుడు దేశవ్యాప్తంగా 10 కోట్ల మందికి పైగా ఈ పథకం ద్వారా లబ్ధి పొందనున్నారు. ఉజ్వల పథకం గ్రామీణ ఇళ్లలోని  మహిళలకు ఉచిత LPG కనెక్షన్లను అందించనుంది.  

PREV
14
రూ. 400 తక్కువ ధరకే గ్యాస్ సిలిండర్: ఈ లిస్ట్ లో మీ పేరు ఉందో లేదో చెక్  చేసుకోండి..

ప్రస్తుతానికి, వంట కోసం వంటగదిలో ఉపయోగించే దేశీయ LPG ధర న్యూఢిల్లీలో 14.2 కిలోల సిలిండర్‌కు రూ. 1,103గా ఉంది. ప్రస్తుతం  ఇప్పుడు సిలిండర్‌పై రూ. 200 తగ్గి రూ. 903కి చేరుకుంది. దేశీయ ఎల్‌పిజి సిలిండర్‌ల ధరలు చివరిసారిగా మార్చి 1న మారాయి. 
 

24

 తక్కువ ధరకి ఎల్‌పిజి గ్యాస్ సిలిండర్‌లను ఎవరు పొందుతారు?

తాజా ప్రభుత్వ నిర్ణయం వల్ల ఉజ్వల యోజనలో భాగమైన ప్రజలు మరింత ప్రయోజనం పొందుతారు. ప్రభుత్వ సబ్సిడీ కారణంగా ఈ లబ్ధిదారులకు సిలిండర్‌పై రూ.200 తక్కువగా లభించేది. దీంతో ఒక్కో ఎల్‌పీజీ సిలిండర్‌ కు  రూ.903 చెల్లించాల్సి వచ్చింది. అయితే ఇప్పుడు ఈ కొత్త నిర్ణయంతో మరో రూ.200 తక్కువ చెల్లించనున్నారు. అంటే ఉజ్వల లబ్ధిదారులు ఇప్పుడు సిలిండర్‌కు రూ.703 మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది.  

34

75 లక్షల కుటుంబాలకు ఉజ్వల కనెక్షన్లు అందించడం ద్వారా మొత్తం 10.35 కోట్ల మంది లబ్ధి పొందనున్నారు. డొమెస్టిక్ ఎల్‌పిజి సిలిండర్ల ధరలను రూ. 200 తగ్గిస్తూ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం మధ్యప్రదేశ్‌లో కొత్త రాజకీయ చర్చకు దారితీసింది, ఇక్కడ ఈ ఏడాది చివరిలో ఎన్నికలు జరగనున్నాయి. మధ్య ప్రదేశ్ లో రూ.500కే వంటగ్యాస్ సిలిండర్ ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. 
 

44

మరోవైపు కేంద్ర ప్రభుత్వ నిర్ణయం మహిళలకు ఓనం, రక్షా బంధన్‌ సందర్భంగా మోదీ ప్రభుత్వం ఇచ్చిన కానుకగా ప్రచారం జరుగుతోంది. రక్షాబంధన్ సందర్భంగా నా సోదరీమణులు ఇంకా కుటుంబ సభ్యులందరికీ వంటగ్యాస్ సిలిండర్ల ధరలను రూ.200 తగ్గించడం వల్ల చాలా సౌకర్యంగా ఉంటుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.

click me!

Recommended Stories