మీ బంగారు నగలు పోయాయా? జ్యువెల్లరీ షాపు యజమానులే డబ్బు చెల్లిస్తారు. ఎలాగో తెలుసా?

Published : Nov 03, 2024, 10:18 AM IST

మీ మెడలో ఉన్న బంగారు నగలను దొంగలు ఎత్తుకుపోయారా?  లేదా మీ ఇంటిలో దొంగతనం జరిగి బంగారు నగలన్నీ పోయాయా? బాధపడకండి. మీరు ఆ నగలు కొన్న జ్యువెల్లరీ షాపు యజమానులే మీకు డబ్బు చెల్లిస్తారు. పోయిన నగల విలువ ఎంత ఉంటుందో అంత మొత్తం డబ్బు మీకు తిరిగి ఇచ్చేస్తారు. మీరు ఆశ్చర్యపోయినా ఇది నిజం. అదెలాగో ఇప్పుడు తెలుసుకోండి.  

PREV
15
మీ బంగారు నగలు పోయాయా? జ్యువెల్లరీ షాపు యజమానులే డబ్బు చెల్లిస్తారు. ఎలాగో తెలుసా?

బంగారు నగలు అంటే ఇష్టం ఉండని భారతీయ మహిళలు ఉండరంటే అతిశయోక్తి కాదు. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా బంగారు నగలు ఎక్కువగా కొనడం, ఉపయోగించడం చేసే దేశాల్లో భారతదేశం టాప్ 1 లో ఉంది. పెళ్లిళ్లు, పండుగలు, ఇతర ప్రత్యేక సందర్భాల్లో బంగారు నగల కొనుగోలు ఎక్కువగా ఉంటుంది. ఇండియన్స్ బంగారాన్ని సంపద, సాంప్రదాయానికి ప్రతీకగా భావిస్తారు.

ఇండియా తరువాత చైనా కూడా బంగారాన్ని ఎక్కువగా వినియోగించే దేశాలలో ఒకటి. బంగారాన్ని సంపదకు, మానసిక ప్రశాంతతకు చిహ్నంగా భావించే చైనాలో కూడా పెళ్లిళ్లు, ఇతర వేడుకల్లో బంగారు నగలను ఎక్కువగా ఉపయోగిస్తారు. దుబాయ్ లాంటి యునైటెడ్ అరబ్ దేశాలు కూడా బంగారు నగల వ్యాపారానికి ప్రసిద్ధి చెందాయి. 

25

భారతదేశంలో ప్రతి ఏటా సుమారు 800 నుంచి 900 టన్నుల బంగారాన్ని ఇతర దేశాల నుంచి దిగుమతి చేస్తుంటారు. ఇక్కడ బంగారు నగల అమ్మకాలు ప్రత్యేకించి పండుగలు, వివాహ సీజన్ లో ఎక్కువగా ఉంటాయి. సంవత్సరానికి సుమారు 600 నుంచి 700 టన్నుల బంగారు నగలు మార్కెట్లో అమ్ముడవుతుంటాయి. 

ఇంత భారీగా బంగారు నగలపై బిజినెస్ జరిగే ఇండియాలో నగల దొంగతనాలు కూడా అదే రేంజ్ లో జరుగుతున్నాయి. ముఖ్యంగా కొందరు యువత జల్సాలకు అలవాటు పడి చైన్ స్నాచింగ్ కు అలవాటు పడుతున్నారు. మందు, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలకు అలవాటు పడి విచక్షణ మరిచిపోయి దొంగతనాలకు పాల్పడుతున్నారు. చైన్ స్నాచింగ్ ల వల్ల ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. మహిళల మెడల్లో బంగారు నగలు లాక్కెళ్లడం వల్ల వారు కిందపడి గాయాలపాలవుతున్నారు. కొన్ని సందర్భాల్లో ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. 

35

ఇళ్లలో ఉంచిన బంగారు నగలను దొంగలు ఉండనీయడం లేదు. ముఖ్యంగా తాళం వేసిన ఇళ్లనే టార్గెట్ చేసుకొని దొంగతనాలకు పాల్పడుతున్నారు. ఇలా జరిగిన దొంగతనాల్లో పోయిన మీ బంగారు నగలకు జ్యువెల్లరీ షాపు యజమానులే డబ్బు చెల్లిస్తారు. దీని కోసం మీరు కొన్న బంగారు నగలకు ఇన్స్యురెన్స్ చేయించాలి. బంగారు నగలకు కూడా బీమా ఉంటుందా అని ఆశ్యర్యపోతున్నారా? నిజమే ఇన్య్సురెన్స్ ఉంటుంది. కాని ఈ విషయాన్ని చాలా మంది బయటకు చెప్పరు. 
 

45

దొంగిలించిన బంగారు నగలకే కాదు.. వరదలు, తుఫానులు, సునామీ వంటి ప్రకఈతి విపత్తుల్లో మీరు బంగారు నగలు పోగొట్టుకున్నా ఈ ఇన్స్యురెన్స్ వర్తిస్తుంది. అయితే ఈ బీమా సదుపాయం మీకు ప్రతి గోల్డ్ షాపులోనూ లభించకపోవచ్చు. బాగా పాపులర్ అయిన లలితా జ్యువెల్లరీ, తనిష్క్, వంటి పెద్ద చోట్ల లభిస్తుంది. మీరు బంగారు నగలు కొనేముందు ఆ షాపులో ఇన్య్సురెన్స్ సౌకర్యం ఉందో లేదో చెక్ చేసుకొని తీసుకోండి. ఈ బీమా సౌకర్యం కల్పించడం అనేది ఆ దుకాణాల వ్యక్తిగత వ్యవహారం. అందువల్ల చెక్ చేసుకొని తీసుకోవడం బెటర్. 

55

మీ బంగారు నగలు దొంగతనం జరిగినా, మీ మెడలో నగలు దొంగలు లాక్కెళ్లిపోయినా మీరు వెంటనే పోలీస్ కంప్లయింట్ ఇవ్వాలి. పోలీసులు ఎక్వైరీ చేసి నగలు పోయినట్లు ఓ లెటర్ ఇస్తారు. ఈ రెండిటినీ తీసుకెళ్లి మీరు నగలు కొన్న జ్యువెల్లరీ షాపులో చూపిస్తే ఇన్య్సురెన్స్ రూల్స్ ప్రకారం దుకాణ యజమానులు మీరు పోగొట్టుకున్న నగల విలువైన డబ్బును తిరిగి చెల్లిస్తారు. నగలు కొనేటప్పుడు ఈ బీమా సౌకర్యాన్ని మీరూ ఉపయోగించుకోండి. 
 

click me!

Recommended Stories