ప్రపంచం గర్వించదగ్గ వ్యాపారవేత్త రతన్ టాటా
రతన్ టాటా 1991లో $100 బిలియన్ల స్టీల్-టు-సాఫ్ట్వేర్ రంగంలో రాణిస్తున్న టాటా గ్రూప్ కు ఛైర్మన్ అయ్యారు, వంద సంవత్సరాల క్రితం తన ముత్తాత స్థాపించిన గ్రూప్ను 2012 వరకు నడిపారు. ఇక 1996లో టెలికమ్యూనికేషన్స్ కంపెనీ టాటా టెలిసర్వీసెస్ని స్థాపించాడు. 2004లో ఐటి కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ని పబ్లిక్గా తీసుకున్నాడు. 2009లో రతన్ టాటా ప్రపంచంలోనే అత్యంత చవకైన కారును మధ్యతరగతి ప్రజలకు అందుబాటులోకి తెస్తానని తన వాగ్దానాన్ని నెరవేర్చాడు. టాటా నానో ₹ 1 లక్ష ధరతో కారును తీసుకువచ్చారు.
టాటా 1991 నుండి 2012 వరకు, 2016 నుండి 2017 వరకు టాటా గ్రూప్ కు రెండుసార్లు చైర్పర్సన్గా ఉన్నారు. అతను సంస్థ రోజువారీ నిర్వహణ నుండి వైదొలిగినప్పటికీ, అతను దాని ఛారిటబుల్ ట్రస్ట్లకు నాయకత్వం వహించాడు. సైరస్ మిస్త్రీ, రతన్ టాటా తర్వాత టాటా సన్స్ ఛైర్మన్గా బాధ్యతలు స్వీకరించారు, కానీ తరువాత భారతదేశం అత్యంత ఉన్నత స్థాయి బోర్డ్రూమ్ తిరుగుబాటులో పదవీచ్యుతుడయ్యారు. 2022లో కారు ప్రమాదంలో మరణించారు.
360 వన్ వెల్త్ హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2023 ప్రకారం ఎక్స్ లో 13 మిలియన్లకు పైగా ఫాలోవర్లు, ఇన్స్టాగ్రామ్లో దాదాపు 10 మిలియన్ల మంది ఫాలోవర్లతో భారతదేశంలో 'అత్యధికంగా అనుసరించే వ్యవస్థాపకుడుగా రతన్ టాటా నిలిచారు.