రుచుల ప్రపంచానికి తీరని నష్టం.. 'బికనెర్వాలా' వ్యవస్థాపకుడు మృతి.. స్వీట్ షాప్ నుండి నేడు ప్రపంచస్థాయికి...

Ashok Kumar | Published : Nov 14, 2023 1:59 PM
Google News Follow Us

ప్రతిష్టాత్మక స్వీట్స్ అండ్  స్నాక్స్ చైన్ బికనెర్వాలా వ్యవస్థాపకుడు లాలా కేదార్‌నాథ్ అగర్వాల్ కన్నుమూశారు. ఆయనకు 86 ఏళ్లు. సమాచారం ప్రకారం, బికనెర్వాలాకు భారతదేశంలో 60 కంటే ఎక్కువ స్టోర్స్  ఉన్నాయి. 

14
రుచుల ప్రపంచానికి తీరని నష్టం.. 'బికనెర్వాలా' వ్యవస్థాపకుడు  మృతి.. స్వీట్ షాప్ నుండి నేడు ప్రపంచస్థాయికి...

అమెరికా, న్యూజిలాండ్, సింగపూర్, నేపాల్ ఇంకా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) వంటి దేశాల్లో కూడా అవుట్‌లెట్‌లు ఉన్నాయి. కేదార్‌నాథ్ అగర్వాల్ తన వ్యాపార ప్రయాణాన్ని ఢిల్లీ నుండి ప్రారంభించారు.
 

24

పాత ఢిల్లీలో మిఠాయిలు
లాలా కేదార్‌నాథ్ అగర్వాల్‌ను కాకాజీ అని కూడా పిలుస్తారు. అతని మరణానంతరం, బికనెర్వాలా ఒక ప్రకటనలో, 'రుచిని సుసంపన్నం చేసి, ఎంతో మంది ప్రజల జీవితాల్లో తన స్థానాన్ని సంపాదించుకున్న కాకాజీ మరణంతో ఒక శకం ముగిసింది. బికనెర్వాలా మేనేజింగ్ డైరెక్టర్ శ్యామ్ సుందర్ అగర్వాల్ మాట్లాడుతూ, 'కాకాజీ మృతి బికనెర్వాలాకు మాత్రమే కాదు రుచుల ప్రపంచానికి  నష్టం. ఆయన దార్శనికత, నాయకత్వమే మన వంటల ప్రయాణానికి ఎప్పుడూ మార్గదర్శకంగా ఉంటుంది అని తెలిపింది. 
 

34

బికనీర్ నివాసి అయిన అతని కుటుంబం 1905 నుండి మిటై షాప్ ఉంది. ఆ షాప్  పేరు బికనీర్ మిథాయ్ భండార్, అందులో కొన్ని రకాల స్వీట్లు ఇంకా స్నాక్స్ మాత్రమే అందుబాటులో ఉండేవి. కేదార్‌నాథ్ అగర్వార్ తన సోదరుడు సత్యనారాయణతో కలిసి 1950లో ఢిల్లీకి వచ్చారు. 

Related Articles

44

అన్నదమ్ములిద్దరూ పాత ఢిల్లీలో గుజియా, రసగుల్లా బకెట్ల నిండా అమ్మేవారు. ఢిల్లీ ప్రజలు బికనీర్  ప్రత్యేకమైన రుచిని చాలా తక్కువ సమయంలో ఇష్టపడటం ప్రారంభించారు. ఆ తర్వాత ఇద్దరూ కలిసి ఢిల్లీలోని చాందినీ చౌక్‌లో ఓ దుకాణం ప్రారంభించారు. అతను తన కుటుంబ వంటకాన్ని స్వీకరించి, తరతరానికి అందించాడు. 

Recommended Photos