అలాంటి దిగ్గజ కంపెనీ ఎలక్ట్రిక్ మోటార్ రంగంలోకి అడుగు పెట్టిందంటే పోటీ కంపెనీలు కచ్చితంగా భయపడతాయి. ఇప్పటికే మార్కెట్లో ఎలక్ట్రిక్ వెహికల్స్ తయారీ రంగంలో ఓలా అగ్రగామిగా కొనసాగుతోంది. తరువాత స్థానాల్లో ఏథర్, టీవీఎస్, ఓకినావా, బజాజ్, హోండా వంటి కంపెనీలు తమ ప్రోడక్ట్స్ అందిస్తున్నాయి. వాటికి పోటీగా రిలయన్స్ జియో తనదైన శైలిలో ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకొస్తోంది. ఇది ఒకసారి రీఛార్జ్ చేస్తే 110 కి.మీ వరకు ప్రయాణించొచ్చు.
జియో ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రత్యేకతలివే..
క్లౌడ్ కనెక్టివిటీ, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, USB ఛార్జింగ్ పోర్ట్, LED డిస్ప్లే, బ్లూటూత్ వంటి అధునాతన ఫీచర్లు ఈ స్కూటర్లో ఉన్నాయి.