సొసైటీలో జరుగుతున్న మోసాల్లో చాలా రకాలు ఉన్నాయి. దొంగతనాలు, దారి దోపిడీలు, అప్పు తీసుకునే ఎగ్గొట్టడం, జనాల దగ్గర డబ్బులు వసూలు చేసి పరారైపోవడం ఇలా ఎన్నో రకాలుగా మోసం జరుగుతున్నాయి. ఇలాంటి వాటి గురించి ప్రజలు అప్రమత్తంగా ఉన్నా, ఇప్పుడు ఆన్ లైన్ లో కొత్త రకాల మోసాలు మొదలయ్యాయి. ఫోన్లకు లింక్స్ పంపించు ఓపెన్ చేయమని చెప్పి, బ్యాంకు బ్యాలెన్స్ మొత్తం ఖాళీ చేస్తున్నారు. అలాగే ఓటిపిలు పంపించే వాటి ద్వారా కూడా బ్యాంకు అకౌంట్స్ లో డబ్బులు మొత్తం దోచేస్తున్నారు.