ఇక భారతీయ రైల్వేకు వచ్చే భారీ ఆదాయంలో కొంత భాగం టికెట్ రద్దు ద్వారా కూడా వస్తుంది. నిజానికి, చాలా మంది రైలు టిక్కెట్లు బుక్ చేసుకున్న తర్వాత అనుకోని కారణాలతో తమ టిక్కెట్లను రద్దు చేసుకుంటారు. రైల్వే నిబంధనల ప్రకారం, RAC లేదా వెయిటింగ్ లిస్ట్ టికెట్ రద్దు చేసుకుంటే, రీఫండ్ మొత్తంలో రూ.60 తగ్గిస్తారు. మరోవైపు, రైలు బయలుదేరే షెడ్యూల్కు 48 గంటల ముందు కన్ఫర్మ్ టికెట్ రద్దు చేసుకుంటే, ఫస్ట్ ఏసీలో రూ.240, సెకండ్ ఏసీలో రూ.200, థర్డ్ ఏసీలో రూ.180, స్లీపర్ క్లాస్లో రూ.120, సెకండ్ క్లాస్లో రూ.60 జరిమానా విధిస్తారు. ఇవన్నీ రైల్వే ఆదాయంగానే చెప్పొచ్చు.