భారత పౌరసత్వాన్ని ఈజీగా వదులుకుంటున్న శ్రీమంతులు... ఈ ఐదు దేశాల సిటిజన్‌షిప్ కోసమే..

Published : Aug 14, 2024, 11:13 AM ISTUpdated : Aug 14, 2024, 11:17 AM IST

2023 సంవత్సరంలో ఏకంగా 2,16,219 మంది భారత పౌరసత్వాన్ని వదులకున్నారట. వీరిలో ఎక్కువమంది ఏ  దేశాల్లో స్థిరనివాసం ఏర్పాటుచేసుకుంటున్నారో తెలుసా..?  

PREV
15
భారత పౌరసత్వాన్ని ఈజీగా వదులుకుంటున్న శ్రీమంతులు... ఈ ఐదు దేశాల  సిటిజన్‌షిప్  కోసమే..
indian citizenship

ఉన్నత చదువులని కొందరు... ఉద్యోగం, ఉపాధి కోసం మరికొందరు...వ్యాపారాల కోసం మరికొందరు భారతదేశాన్ని వీడుతున్నారు. ఇలా ప్రతిఏటా లక్షలాదిమంది భారతీయ విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులు విదేశాలకు వెళుతున్నారు. ఇలా వెళ్ళినవారు అక్కడ మంచి ఉద్యోగం, ఆదాయం వనరులు వుండటం... విలాసవంతమైన, అధునాతన జీవితంతానికి అలవాటుపడి పాటు తిరిగి స్వదేశానికి వచ్చేందుకు ఇష్టపడటం లేదు. విదేశాల్లోనే స్థిరనివాసం ఏర్పాటుచేసుకుని ఆ దేశ పౌరులుగా మారిపోతున్నారు...  భారత పౌరసత్వాన్ని వదులుకుంటున్నారు. 

25
indian citizenship

రోజురోజుకు స్వదేశాన్ని వీడుతున్నవారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది... ఈ క్రమంలోనే భారత పౌరసత్వాన్ని  వదులుకుంటున్నవారు ఎక్కువగా వుంటున్నారు. తాజాగా భారత విదేశీ వ్యవహారాల శాఖ విదశాల్లో స్థిరపడిపోయి భారత పౌరసత్వాన్ని వీడినవారి లెక్కలు ప్రకటించింది. గతేడాది అంటే 2023 లో ఏకంగా 2,16,219 మంది భారత పౌరసత్వాన్ని వదులకున్నారట. ఈ గణాంకాలు ఆందోళన కలిగించేలా వున్నాయి. 

గత రెండేళ్లుగా భారత పౌరసత్వాన్ని వదులకుంటున్నవారి సంఖ్య గణనీయంగా వుంది. 2023 కంటే ఎక్కువగా 2022లో ఏకంగా 2,25,620 మంది భారత పౌరసత్వాన్ని వదులుకున్నారు. ఇక 2021లో 1,63,370, 2020లో 85,256, 2019 లో 1,44,017 మంది పౌరసత్వాన్ని వీడారు. మొత్తంగా చూసుకుంటూ 2011 నుండి ఇప్పటివరకు 16 లక్షలమందికి పైగా భారతీయులు పౌరసత్వాన్ని వదులుకున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. 
 

35
indian citizenship

ఇలా భారత పౌరసత్వాన్ని వదులకున్న విదేశీ పౌరసత్వాన్ని పొందుతున్నారు. ముఖ్యంగా భారతీయ ధనవంతులే ఎక్కువగా విదేశాల్లో స్థిరనివాసం ఏర్పాటుచేసుకుంటున్నారు. ఆ దేశాల్లో పెట్టుబడులు పెట్టడంద్వారా వ్యాపారవేత్తలు, శ్రీమంతులు చాలా ఈజీగా పౌరసత్వాన్ని పొంది శాశ్వతంగా అక్కడే వుండిపోతున్నారు. మరికొందరు మంచి ఉద్యోగాల్లో స్థిరపడిపోయి పిల్లాపాపలతో విదేశాల్లోనే వుండిపోతున్నారు. 

ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కో-ఆపరేటివ్ ఆండ్ డెవలప్ మెంట్ (OECD) దేశాలకు వలసవెళ్లేవారిలో భారతీయులే అత్యధికంగా వున్నారు. ఇలా ధనిక దేశాల్లో కుటుంబ సమేతంగా నివాసం వుండేందుకు భారత శ్రీమంతులు ఇష్టపడుతున్నారు. దీంతో భారీగా పెట్టుబడలు పెట్టడంద్వారా కొందరు...   శాశ్వత వీసాల కోసం భారీగా ఖర్చుచేసి మరికొందరు... చాలాకాలంగా విదేశాల్లోనే వుండి ఇంకొందరు విదేశీ పౌరసత్వాన్ని పొందుతున్నారు. 

45
indian citizenship

భారతీయులు అత్యధికంగా పౌరసత్వం పొందుతున్న దేశాలివే : 

భారతీయులు ఉన్నత చదువులు, ఉద్యోగాల కోసం ఎక్కువగా అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా వంటి దేశాలకు ఎక్కువగా వెళుతుంటారు. కానీ వ్యాపారాల కోసం విదేశాలకు వెళ్లే భారతీయుల్లో ఎక్కువమంది వేళ్లేది పోర్చుగల్. భారతీయ ధనవంతులు, వ్యాపారులు ఎక్కువగా పోర్చుగల్ లో నివాసం వుంటున్నారు. ఈ  మేరకు విదేశాల్లో స్థిరనివాసం, పౌరసత్వం కోసం ప్రయత్నించేవారికి  సేవలు అందించే  హెన్లీ ఆండ్ పార్టనర్స్ సంస్థ కీలక సమాచారం వెల్లడించింది. 
 

55
indian citizenship

పోర్చుగల్ తర్వాత పెట్టుబడుల ద్వారా  భారత వ్యాపారులు స్థిరపడేందుకు ఆసక్తి చూపుతున్న దేశం ఆస్ట్రేలియా. ఈ దేశంలో పెట్టుబడులు పెట్టేవారికి అనేక సదుపాయాలను కల్పిస్తున్నారు. అంతేకాదు ఇక్కడ  లగ్జరీ జీవనవిధానం వుండటంతో ఇక్కడ స్థిరనివాసం ఏర్పాటుచేసుకుంటున్నారు. 

భారతీయ ధనవంతులు ఆసక్తి చూసుతున్న దేశాల్లో అమెరికాది మూడో స్థానం. ఆ తర్వాత మాట్లా, గ్రీస్ దేశాలున్నాయి.  ఇలా భారత ధనికులు స్థిరనివాసం కోసం మొగ్గుచూపుతున్న టాప్ 5 దేశాల జాబితాను హెన్లీ ఆండ్ పార్ట్‌నర్స్‌ సంస్థ వెల్లడించింది. 

click me!

Recommended Stories