ప్రపంచంలోనే అతిపెద్ద రైలు నెట్వర్క్లలో భారతీయ రైల్వే ఒకటి. మన దేశంలో ప్రతిరోజూ 19 వేలకు పైగా రైళ్లు నడుస్తున్నాయి. ఇందులో ప్రతిరోజూ లక్షలాది మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు. ఇక్కడ డీజిల్తో నడిచే రైళ్లు, విద్యుత్తో నడిచే రైళ్లు ఎక్కువ. కొన్ని చోట్ల ఆవిరితో నడిచే రైళ్లు కూడా ఉన్నాయి.
ఇండియాలో హైడ్రోజన్ ఇంధనంతో నడిచే రైలు ఈ నెల అంటే మార్చి లోనే ప్రారంభమవుతుందని సమాచారం. ఈ హైడ్రోజన్ రైలుకు పెట్రోల్, డీజిల్ అవసరం లేదు. పర్యావరణానికి ఎలాంటి కాలుష్యం కలగని విధంగా వీటిని తయారు చేస్తున్నారు.