బంగారం తగ్గిందనుకునేలోపే మరోసారి ధరలు ఎగబాకాయి. 24 క్యారెట్లపై దాదాపు రూ.1,420, 22 క్యారెట్లపై రూ.1,300 మేర పెరుగుదల నమోదైంది. 24 క్యారెట్ల మేలిమి బంగారం ఇప్పడు రూ.1,55,350కు చేరింది. ఇదే సమయంలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,42,200కు పెరిగింది. విజయవాడ, విశాఖ, చెన్నై, ముంబయి ఇవే ధరలు కొనసాగుతున్నాయి.