21 ఆగష్టు 2021 రాత్రి 9 గంటల నుండి 22 ఆగస్టు 2021 మధ్యాహ్నం 3 గంటల వరకు నెట్బ్యాంకింగ్లో ఖాతాదారులు లోన్ సంబంధిత సదుపాయాలు పొందలేరని బ్యాంక్ సమాచారం ఇచ్చింది అంటే 18 గంటల పాటు బ్యాంక్ సర్వీసులకు బ్రేక్ పడనుంది. ఈ అంతరాయం డిజిటల్ బ్యాంకింగ్ సౌకర్యాలను మరింత మెరుగుపరచడానికి అని బ్యాంక్ చెప్పింది. మా కస్టమర్లకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నామని ఇందుకు కస్టమర్లు మాతో సహకరిస్తారని ఆశిస్తునట్లు బ్యాంక్ తెలిపింది.