Gold: బంగారం త్వరలోనే రూ. 1 లక్ష దాటుతోంది..పసిడిలో డబుల్ లాభం కావాలంటే బంగారంలో ఇలా పెట్టుబడి పెట్టండి..?

First Published May 25, 2023, 1:57 AM IST

అమెరికా ఆర్థిక సంక్షోభం పుణ్యమా అని, బంగారం ధర త్వరలోనే, ఒక లక్ష రూపాయల వరకు చేరుతుందని వార్తలు ప్రస్తుతం దేశాన్ని కుదిపేస్తున్నాయి. అయితే ఈ స్థాయిలో బంగారం పెరిగితే మరి దాని లాభాలను ఎలా ఓడిసిపట్టుకోవాలి. అనే ఆలోచన మీకు కలగవచ్చు. ఎందుకంటే బంగారంపై పెట్టుబడి పెడితే చాలా రెట్ల లాభం వస్తున్నట్లు మనం గడిచిన 20 సంవత్సరాలుగా గమనించినట్లయితే తెలుస్తోంది. 

ముఖ్యంగా గత పది సంవత్సరాల్లో బంగారం ధర దాదాపు రెండింతలు అయింది.  2013లో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు గాను 29 వేల రూపాయలు చెల్లించాల్సి వచ్చింది.  అదే 2023 సంవత్సరానికి వచ్చేటప్పటికి 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు గాను 62 వేల రూపాయలు చెల్లించాల్సి వస్తోంది. అంటే దాదాపు మీరు డబుల్ లాభం పొందినట్లు. ఈ లెక్కన 20 సంవత్సరాల క్రితం అంటే, 2003లో బంగారం కొనుగోలు చేసినప్పుడు, కేవలం 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు గాను రూ.5 వేల రూపాయలు మాత్రమే ఉంది. దాని విలువ ప్రస్తుతం 2023లో 62 వేలకు చేరింది అంటే దాదాపు 12 రెట్లు పెరిగింది అని అర్థం. 
 


దీన్నిబట్టి రియల్ ఎస్టేట్,  స్టాక్ మార్కెట్,  తరహాలో బంగారం కూడా చక్కటి లాభాలను  అందించే అసెట్ క్లాస్ అని మాత్రం చెప్పవచ్చు. అయితే బంగారం ధర పెరుగుతున్న ఈ నేపథ్యంలో లాభాలను ఒడిసిపట్టాలనుకుంటే మాత్రం బంగారంపై పెట్టుబడి పెట్టేటప్పుడు కొన్ని విషయాలను జాగ్రత్తగా తెలుసుకోవాల్సిన అవకాశం ఉంది. 

ముందుగా బంగారం ఏ విధంగా కొనుగోలు చేస్తారు. ఏ రూపంలో కొనుగోలు చేస్తారు. అనేది ముఖ్యం, మీరు పెట్టుబడిగా భావించినట్లయితే బంగారం కొనుగోలు చేసేందుకు గోల్డ్ బాండ్స్ సురక్షితమైనవి.  ఎందుకంటే మీరు ఫిజికల్ బంగారం కొనుగోలు చేస్తే దాన్ని భద్రపరచడం చాలా కష్టమైన పని.  అంతేకాదు మీరు దాన్ని నగల షాపులో ఇస్తే నగదు ఇస్తారన్న గ్యారెంటీ లేదు.  బంగారానికి బంగారం ముట్ట చెప్పే అవకాశం ఉంది..  అందుకే గోల్డ్ బాండ్స్ అనేది చక్కటి ప్రత్యామ్నాయం అని చెప్పవచ్చు మ్యూచువల్ ఫండ్స్ తరహాలోనే బంగారంపై కూడా పెట్టుబడి పెట్టవచ్చు. 
 

గోల్డ్ ఈటీఎఫ్
గోల్డ్ ఎక్స్చేంజ్ ట్రేడ్ ఫండ్స్లో పెట్టుబడి పెట్టడం ద్వారా మీరు మార్కెట్లో బంగారంపై ఏర్పడుతున్న హెచ్చుతగ్గుల నుంచి లాభం పొందే అవకాశం ఉంటుంది ఈ గోల్డ్ ఈటీఎఫ్ ల మ్యూచువల్ ఫండ్ సంస్థలు నిర్వహిస్తాయి.  షేర్ల తరహాలోనే మీరు యూనిట్లను కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది బంగారం ధర హెచ్చుతగ్గులకు లోన అయినప్పుడల్లా ఈ యూనిట్ ధరలో కూడా మార్పులు వస్తూ ఉంటాయి. . తద్వారా మీరు సులభంగా బంగారం కొనవచ్చు అదేవిధంగా మీరు విక్రయించుకునే అవకాశం ఈ గోల్డ్ ఈపీఎఫ్ ద్వారా లభిస్తుంది. 
 

.సావరిన్ గోల్డ్ బాండ్స్
 కేంద్ర ప్రభుత్వం జారీ చేసే సవరిన్ గోల్డ్ బాండ్స్ లో పెట్టుబడి పెట్టడం ద్వారా చక్కటి ఆదాయం పొందే అవకాశం ఉంది సాధారణంగా  ఫిజికల్ బంగారం కొనుగోలు చేస్తే,  దాన్ని నిల్వ చేసుకోవడం ద్వారా  మీకు ఎలాంటి లాభం ఉండదు.  అదే మీరు సేవర్ ఇన్ గోల్డ్ బాండ్స్ లో పెట్టుబడి పెట్టినట్లయితే ప్రతి నెల వడ్డీ కూడా లభిస్తుంది. . అంతేకాదు మార్కెట్లో బంగారం ధర అనుగుణంగా ఈ బాండ్స్ ధర కూడా పెరుగుతూ ఉంటుంది. . సావరింగ్ గోల్డ్ బాండ్స్ ను భారత ప్రభుత్వం జారీ చేస్తుంది
 

click me!