బంగారం కొనేవారికి చుక్కలు.. ఒక్క నెలలో రూ.22 వేలు పెరిగిన గోల్డ్ రేట్ !
ప్రస్తుతం దేశీయంగా, అంతర్జాతీయంగా బంగారం, వెండి ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. పసిడి, వెండి ధరల తీరు చూస్తుంటే సామాన్యులు బెంబేలెత్తిపోతున్నారు. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులకు తోడు, దేశీయంగా, అంతర్జాతీయ మార్కెట్లో బంగారం, వెండికి ఉన్న భారీ డిమాండ్ కారణంగా వీటి ధరల్లో విపరీతమైన పెరుగుదల కనిపిస్తోంది.
కొత్త సంవత్సరం 2026 ప్రారంభమై ఇంకా ఒక నెల కూడా పూర్తి కాలేదు, కానీ ఈ కొద్ది రోజుల్లోనే బంగారం, వెండి ధరలు సృష్టించిన రికార్డులు అన్నీ ఇన్నీ కావు. జనవరి 1 నుండి 23 వరకు బంగారం ధరలో రూ.22 వేలకు పైగా పెరుగుదల కనిపించింది. అదే సమయంలో వెండి ధర ఏకంగా రాకెట్ వేగంతో దూసుకెళ్లింది. వెండి పెరిగిన తీరు, ఆ గణాంకాలను చూస్తే మీరు కచ్చితంగా ఆశ్చర్యంతో ముక్కున వేలేసుకుంటారు. కమోడిటీ మార్కెట్లో బంగారం, వెండి తమ పెరిగిన ధరలతో నిజంగానే సంచలనం సృష్టిస్తున్నాయి.
గత జనవరి 1 నుంచి 23 వెండి ధరలో రూ.90 వేలకు పైగా పెరుగుదల కనిపించింది. జనవరి 1, 23 తేదీల మధ్య బంగారం, వెండి ధరల వ్యత్యాసం ఎలా ఉందో, రేట్లు ఎంత పెరిగాయనే విషయాలు గమనిస్తే.. శనివారం కావడంతో మార్కెట్లకు సెలవు. ఇక 25న ఆదివారం కూడా ధరల్లో అప్డేట్ ఉండదు. కాబట్టి ఇప్పుడు నేరుగా వచ్చే వారం అంటే సోమవారం కమోడిటీ మార్కెట్లో కొత్త ధరలు అప్డేట్ అవుతాయి. అప్పటి వరకు జనవరి 23 నాటికి నమోదైన అధికారిక గణాంకాలు ఉంటాయి.