Today Gold Rate in Hyderabad: కొనుగోలుదారులపై ఆశలపై నీళ్లు చల్లిన మార్కెట్లు, మళ్లీ పెరిగిన బంగారం

Published : Mar 25, 2026, 10:46 AM IST

Today Gold Rate in Hyderabad: తగ్గుతూ వచ్చిన బంగారం, వెండి...ఇప్పుడు మళ్లీ పంజుకున్నాయి. యుద్ధం ఆపేస్తామని ట్రంప్ ప్రకటించడంతో ధరలు ఒక్కసారిగా ఎగబాకాయి. 10 గ్రాముల బంగారం ఎంత పెరిగిందంటే... 

PREV
13
పంజుకున్న పసిడి, వెండి

మార్చి 25 న బంగారం ధరలు పెరిగే అవకాశం ఉందని నిపుణులు ముందే హెచ్చరించారు. ఊహించినట్లుగానే పసిడి, సిల్వర్ ఒక్కసారిగా పెరిగిపోయింది. మొన్నటివరకూ రూ.15వేల వరకూ పడిపోయిన పుత్తడి....ఈరోజు పుంజుకుంది. రెండ్రోజుల క్రితం ధరలు క్షీణించడంతో కొనుగోలుదారులకు కాస్త ఊరట దొరకడంతో కొనేందుకు ఎగబడ్డారు. దాదాపు తులం పసిడి రూ.1,40,000వేలకు పతకం కావడంతో రిలీఫ్ దొరికినట్లైంది. యుద్ధం ఆగని క్రమంలో బంగారం ఇంకా తగ్గుతుందని అంచనా వేశారు. దాదాపు రూ.లక్షకు క్రాష్ అవుతుందని భావించారు. ఈనెల చివరకు ధరలు తగ్గి బంగారం కొనుగోళ్లు పెరుగుతాయనుకుంటే...ఇప్పుడు ఎగబాకి మార్కెట్లు షాకిచ్చాయి.

23
చర్చలకు అమెరికా పిలుపుఇవ్వడంతో పెరిగిన ధరలు

యుద్ధ పరిస్థితుల్లోశాంతి చర్చలకు అమెరికా పిలుపుఇవ్వడంతో ధరలు పెరుగుతున్నాయి. నిన్న, మొన్నటివరకు అమెరికా, ఇజ్రాయెల్,ఇరాన్ మధ్య వార్ కారణంగా ముడిచమురు పెరిగింది, డాలర్ పడింది. కానీ బంగారం, వెండి లోహాలు క్షీణిస్తూ వచ్చాయి. ఒక దశలో ఇన్వెస్టర్లు బంగారంపై పెట్టుబడి పెట్టడం ఆపేశారు. అంతా డాలర్ వైపు మొగ్గుచూపారు. ఇప్పుడు యుద్ధం ముగుస్తుందన్న దశలో పసిడి ధరలు పెరగడం మొదలుపెట్టాయి. ఇవి మళ్లీ ఏస్థాయిలో పెరుగుతుందో అని కొనుగోలుదారులు ఆందోళన చెందుతున్నారు.

33
హైదరాబాద్ మార్కెట్లో ధరలు ఎలా ఉన్నాయంటే

ఇక హైదరాబాద్ మార్కెట్లో ధరలు ఎలా ఉన్నాయంటే...24 క్యారెట్ల పసిడి 10 గ్రాములపై రూ.3,760 పెరిగి రూ.1,46,670కు చేరింది. 22 క్యారెట్ల ఆభరణాల బంగారంపై రూ.3,450 ఎగబాకి రూ.1,34,450 వద్దకు వచ్చింది. కేజీ వెండి కూడా రూ.10వేలు పెరిగి రూ.2.60లక్షలకు పెరిగిపోయింది. 

Read more Photos on
click me!

Recommended Stories