బంగారం ధర పెరుగుదలకు కారణం
గత ఐదు సంవత్సరాల్లో, బంగారం ధర 110% కంటే ఎక్కువ పెరిగింది. ఇది ఏప్రిల్ 2020లో 10 గ్రాములకు రూ.44,906గా ఉండగా, ఏప్రిల్ 2025లో రూ.95,239కి చేరుకుంది. వాణిజ్య వివాదాలు,అమెరికా మాంద్యం ముప్పు వంటి అనేక ప్రపంచ ఆర్థిక కారకాల వల్ల ఈ ధర పెరుగుదలకు కారణమని నిపుణులు చెబుతున్నారు.