దేశీయ బులియన్ మార్కెట్లో ప్రస్తుతం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,55,510గా ఉంది. హైదరాబాద్లో కూడా ఇదే రేటు కొనసాగుతోంది. నిన్నటితో పోలిస్తే ఇవాళ పసిడి ధర ఏకంగా రూ.1,200 పెరిగింది. ఇక 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.1,42,550 పలుకుతోంది. ఈ ధర కూడా ఒక్కరోజులో రూ.1,100 పెరిగింది. విజయవాడ, విశాఖపట్నంలోనూ ఇదే స్థాయిలో బంగారం ధరలు కొనసాగుతున్నాయి.
వెండి మార్కెట్లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఢిల్లీలో కిలో వెండి ధర ప్రస్తుతం రూ.2.55 లక్షలుగా ఉంది. నిన్న కిలో వెండి రూ.2.50 లక్షల వద్ద ఉండగా.. ఇవాళ రూ.5,000 పెరిగింది. హైదరాబాద్లో కూడా కిలో సిల్వర్ రూ.2.55 లక్షల వద్ద ఉంది. చెన్నై, బెంగళూరులోనూ దాదాపు ఇదే ధర కొనసాగుతోంది.