జనవరి 29న బంగారం ధరలు గరిష్ట స్థాయిని చేరాయి. ఆ సమయంలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,78,000 పైగా ఉండగా, ప్రస్తుతం అది రూ.1,40,000కు పడిపోయింది. అంటే దాదాపు రూ.30వేలకు పైగా తగ్గుదల నమోదైంది. అలాగే 22 క్యారట్ బంగారం కూడా రూ.1,63,000 స్థాయి నుంచి రూ.1,28,000 వరకు పడిపోయింది. ఇక వెండి విషయంలో అయితే పెద్ద మార్పు కనిపిస్తోంది. జనవరిలో కిలో వెండి రూ.4.25,000 వరకు చేరగా, ఇప్పుడు అది రూ.2.45లక్షల వద్ద ఉంది. అంటే దాదాపు రూ.1,80,000 మేర పతనం.