బంగారం, వెండి ధరలను పరిశీలిస్తే మల్టీ-కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో ఉదయం 9:45 గంటలకు గోల్డ్ ఫ్యూచర్స్ 0.14 శాతం పెరిగి 10 గ్రాములకు రూ.49,109కి చేరుకోగా, వెండి కిలోగ్రాముకు 0.28 శాతం పెరిగి రూ.66,419కి చేరుకుంది.
పృథ్వీ ఫిన్మార్ట్ కమోడిటీ రీసెర్చ్ నుండి మనోజ్ కుమార్ జైన్ మాట్లాడుతూ, ఈ రెండు విలువైన లోహాలు నేటి (నవంబర్ 17) సెషన్లో అస్థిరంగా ఉంటాయని ఆశిస్తున్నామని చెప్పారు. జైన్ ప్రకారం బంగారం ట్రాయ్ ఔన్స్కు 1832 డాలర్లు (రూ. 1,36198.02), వెండి ట్రాయ్ ఔన్స్ 24.50 డాలర్లు (రూ. 1821.43) ఉండవచ్చు. అని అన్నారు.