నిన్న సాయంత్రం బంగారం ధరలు భారీగా పెరిగాయి. నిన్న ఉదయం తగ్గిన పసిడి...సాయంత్రానికి దూసుకెళ్లింది. దాదాపు 24 క్యారెట్లపై రూ.1,200 పెరిగి రూ.1,44,440కు చేరుకుంది. దీంతో చాలా మంది కన్ఫ్యూజ్ అయ్యారు. ఇప్పుడు కొనడం, మంచిదా కాదా అని ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ఇవాళ ఉదయం మళ్లీ గోల్డ్ ధరలు కాస్త తగ్గుముఖం పట్టాయి. 24 క్యారెట్ల బంగారంపై రూ.490 తగ్గి రూ.రూ.1,44,330 చేరుకుంది. ఇక 22 క్యారెట్లపై రూ.450 తగ్గి రూ.1,32,300 వద్ద కొనసాగుతోంది. అటు వెండిపై రూ.5వేలు పతనమై...రూ.2,40,000వేలకు చేరుకుంది.