భారత్ మొబిలిటీ గ్లోబల్ షో 2025లో గోదావరి ఎలక్ట్రిక్ మోటార్స్ మూడు కొత్త ఈవీలను ప్రారంభించింది. వీటిలో రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లు, ఫియో డిఎక్స్ ఈ మరియు ఫియో జెడ్, మరియు ఒక ప్యాసింజర్ ఆటో ఉన్నాయి. ఫియో డిఎక్స్ ఈ, ఫియో జెడ్ అనే రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లు తక్కువ బడ్జెట్ లో ఎక్కువ ఫీచర్లతో లాంచ్ అయ్యాయి. స్వదేశీ కంపెనీ కాబట్టి ఇక్కడ ప్రజల అవసరాలు బాగా తెలుస్తాయి. అందుకే ఇవి వివిధ వర్గాల ప్రజల అవసరాలను తీర్చే విధంగా కంపెనీ తయారు చేసింది.
కంపెనీ రోజీ ఎకో త్రీ-వీలర్ను కూడా విడుదల చేసింది. రోజీ ఎకో షోరూమ్ ధర రూ.2,95,999.