నిరుద్యోగులు వ్యాపారం చేయాలని ఆలోచిస్తున్నారా, అయితే ఇక ఏమాత్రం ఆలస్యం చేయవద్దు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అందిస్తున్నటువంటి ముద్ర రుణాలతో మీరు వ్యాపారం చేసినట్లయితే, ప్రతినెల చక్కటి ఆదాయం పొందే అవకాశం ఉంది. .మీరు ముద్ర లోన్ పొందాలి అనుకుంటే మీ సమీపంలో ఉన్నటువంటి ప్రభుత్వ యాజమాన్య బ్యాంకును సంప్రదిస్తే సరిపోతుంది. దానికి కావాల్సినటువంటి దరఖాస్తులు ఇతర పత్రాలను సమర్పించడం ద్వారా ఎలాంటి తనఖా లేకుండానే మీరు 50 వేల రూపాయల నుంచి పది లక్షల రూపాయల వరకు లోన్ పొందవచ్చు.