ఎలక్షన్స్ అయిపోయే వరకు ఎన్ని మందు బాటిళ్లు తీసుకెళ్లోచ్చో తెలుసా ?

First Published Apr 15, 2024, 6:34 PM IST

ఎలెక్షన్స్ తేదీ ప్రకటించిన తర్వాత దేశవ్యాప్తంగా ఎన్నికల నిబంధనలు అమల్లోకి రావడంతో పాటు పలు విషయాలపై కఠిన ఆంక్షలు విధించారు.
 

దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికల ప్రచారం జరుగుతుండగా, తొలి దశ పోలింగ్ ఏప్రిల్ 19న జరగనుంది. గత నెలలో ఎన్నికల సంఘం ఎన్నికల తేదీలను ప్రకటించడంతో దేశవ్యాప్తంగా ఎన్నికల ప్రవర్తనా నియమావళి( code of conduct) అమల్లోకి వచ్చింది.
 

ప్రవర్తనా నియమావళి విషయానికి వస్తే, నాయకుల నుండి ఇతరుల వరకు అందరూ తప్పనిసరిగా పాటించాల్సిన కొన్ని నియమాలు ఉన్నాయి. ఈ సమయంలో, అన్ని రాష్ట్రాల్లో వాహనాలను ఖచ్చితంగా  చెక్ చేస్తారు. ఎందుకంటే ఎన్నికల సమయంలో డబ్బు, మద్యం పెద్దఎత్తున సప్లయ్  అవుతుంటుంది.
 

నగదు, మద్యంపై  కూడా కఠిన ఆంక్షలు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో రూ.50 వేల కంటే ఎక్కువ నగదు ఉండి దానికి రశీదు(receipt) లేకుంటే పోలీసులు జప్తు చేయవచ్చు.
 

మద్యం సంబంధిత నిబంధనలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోంది, ఏ రాష్ట్రంలోనైనా రెండు నుంచి మూడు మద్యం బాటిళ్లు(liquor bottles)  తీసుకెళ్లవచ్చు. కొన్ని రాష్ట్రాల్లో సీల్డ్ బాటిల్ అనుమతించబడుతుంది.

 అయితే ఇతర రాష్ట్రం నుండి ఒక సీల్డ్ మద్యం బాటిళ్ మాత్రమే తీసుకురావచ్చు. అంతకంటే ఎక్కువ తీసుకువస్తే రూ. 5,000 వరకు జరిమానా విధించబడుతుంది.
 

click me!