ధీ రుభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్ వ్యవస్థాపకురాలు అండ్ రిలయన్స్ ఇండస్ట్రీస్ డైరెక్టర్ నీతా అంబానీ ఆసియాలోనే అత్యంత సంపన్నుడు ముఖేష్ అంబానీ భార్య. నీతా అంబానీ ప్రపంచంలోని అత్యంత విలువైన ఆస్తులను కలిగి ఉంది. నీతా అంబానీ ఆమె కుటుంబంతో కలిసి ప్రపంచంలోనే రెండవ అత్యంత ఖరీదైన నివాసమైన యాంటిల్లాలో నివసిస్తున్నారు. నీతా అంబానీ తన 20 ఏళ్ల వయసులో 1985లో ముఖేష్ అంబానీని పెళ్లాడింది.
ఆమె పెద్ద కోడలు శ్లోకా మెహతాకు 55 మిలియన్ డాలర్ల విలువైన డైమండ్ నెక్లెస్ను బహుమతిగా ఇవ్వడం, 40 లక్షల విలువైన లిప్స్టిక్ని ఉపయోగించడం అంతా వార్తల్లోకెక్కింది. నేడు, ఫోర్బ్స్ 'ఆసియాలో అత్యంత ప్రభావవంతమైన మహిళా వ్యాపారవేత్తల' జాబితాలో నీతా పేరు నిలచింది. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ)లో సభ్యత్వం పొందిన తొలి భారతీయ మహిళ కూడా నీతా అంబానీ.