గత కొన్ని సంవత్సరాలుగా భారతదేశంలో ఆవు పేడ ఎగుమతి వేగంగా పెరుగుతోంది. అనేక దేశాలకు భారతీయ ఆవు పేడ ఎగుమతి అవుతోంది. ఈ దేశాలు ఆవు పేడను అనేక విధాలుగా ఉపయోగిస్తున్నాయి. ఆ దేశాల్లో కువైట్, అరబ్ దేశాలు ముందు వరుసలో ఉన్నాయి.
ఆవు పేడను కువైట్, అరబ్ దేశాలు పొడి రూపంలో వ్యవసాయం కోసం ఉపయోగిస్తున్నాయి. ఆవు పేడ పొడిని ఖర్జూరం మొక్కల పెంపకంలో ఎరువుగా వాడుతున్నాయి. ఈ పొడిని మొక్కలకు వేయడం వల్ల ఖర్జూరం బాగా నాణ్యంగా పెరుగుతుందని ఈ దేశాల వ్యవసాయ శాస్త్రవేత్తలు పరిశోధన చేసి కనుగొన్నారు.
ఖర్జూరంలో ఆవు పేడ పొడిని ఉపయోగించడం వల్ల పండ్ల పరిమాణం పెరిగి, దిగుబడి కూడా గణనీయంగా పెరుగుతోందని గుర్తించారు.