భవిష్యత్తులో రాగి బంగారంగా మారనుందని చెప్పింది మరెవరో కాదు మల్టీ నేషనల్ మైనింగ్ సంస్థ వేదాంతా గ్రూప్ చైర్మన్ అనిల్ అగర్వాల్. ఈయన రాగిని నెక్ట్స్ గోల్డ్గా అభివర్ణించారు. భవిష్యత్తులో క్లీన్ ఎనర్జీ, ఆధునిక సాంకేతిక పరిజ్ఞాన రంగాలలో రాగి ప్రాముఖ్యత భారీగా పెరగనుందని ఆయన అన్నారు.
ముఖ్యంగా ఎలక్ట్రిక్ వాహనాలు, పునరుత్పాదక శక్తి మౌలిక సదుపాయాలు, ఏఐ, రక్షణ పరికరాలలో కాపర్కు పెరుగుతున్న డిమాండ్ను ఆయన ప్రస్తావించారు. కెనడాలోని బారిక్ గోల్డ్ సంస్థ తన పేరులో గోల్డ్ పదాన్ని తొలగించి కేవలం 'బారిక్'గా మార్చడం గ్లోబల్ స్థాయిలో కాపర్ గనులపై పెరగనున్న ప్రాధాన్యతకు సంకేతంగా ఆయన చెప్పుకొచ్చారు.