రిలయన్స్ jio, Airtel, Vodafone-idea నెట్వర్క్ లు భారీగా టారిఫ్ లను పెంచాయి. ఒక్కో ప్లాన్ మీద jio గరిష్టంగా 25 శాతం, Airtel 21 శాతం పెంచడంతో వాటి వినియోగదారులు సోషల్ మీడియా వేదికగా తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వ టెలికాం సంస్థ అయిన BSNL తన టారిఫ్ ధరలను తగ్గిస్తూ ప్రకటన చేయడంతో చాలామంది తమ నెట్వర్క్ ను BSNL లోకి మార్చుకుంటున్నారు.