ఎవరెవరు వస్తారు.?
దేశంలో ఉన్న గిగ్ వర్కర్లకు ఒక గుర్తింపును కల్పించేందుకు, ప్రభుత్వ పథకాలను అందజేసేందుకు వీలుగా ప్రభుత్వం ఇ-శ్రమ్ పోర్టల్లో నమోదు చేయనుంది. సాధారణంగా సంఘటిత రంగంలో పనిచేస్తున్న కార్మికులకు అందుబాటులో ఉన్న ఈ పోర్టల్ గిగ్ వర్కర్లకు కూడా అందుబాటులోకి రానుంది. ఇక గిగ్ వర్కర్ల జాబితాలోకి ఫుడ్ డెలివరీ ఎగ్జిక్యూటివ్స్, క్యాబ్ డ్రైవర్లు, ఫ్రీలాన్స్ డిజైనర్లు, కంటెంట్ క్రియేటర్లు, లాజిస్టిక్స్ సిబ్బంది వంటి వారు వస్తారు. సహజంగా వీరు 'పే ఫర్ వర్క్' బేస్డ్గా పనిచేస్తుంటారు.
దేశ ఆర్థిక వ్యవస్థకు గిగ్ వర్కర్ల సహకారం ఎంతో ఉందని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టే సమయంలో తెలిపారు. 'గిగ్ వర్కర్లు ఆర్థిక వ్యవస్థకు గొప్ప సాయాన్ని అందిస్తారు. మా ప్రభుత్వం వారికి ఇ-శ్రమ్ పోర్టల్లో రిజిస్ట్రేషన్తో ఐడీ కార్డులను ఏర్పాటు చేస్తుంది. వారికి ఆరోగ్య రక్షణను అందిస్తుంది' అని ఆమె చెప్పుకొచ్చారు. దీంతో దేశంలో ఇలా పనిచేస్తున్న కోట్లాది మందికి లబ్ధి చేకూరనుంది.