అలాగే పేమెంట్ల పై బ్యాంకులు కూడా అద్భుతమైన ఆఫర్లను అందిస్తాయి. తాజాగా దేశంలోని దిగ్గజ ప్రభుత్వ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బిఐ) కార్డ్ అన్ని ఇ-కామర్స్ ప్లాట్ఫారమ్లలో షాపింగ్పై వినియోగదారులకు మూడు రోజుల క్యాష్బ్యాక్ ఆఫర్ ప్రకటించింది.
అక్టోబర్ 3 నుండి 5 వరకు
ఈ మూడు రోజుల మెగా షాపింగ్ ఫెస్టివల్ ఆఫర్ 'దమ్దార్ డస్' అక్టోబర్ 3 నుండి ప్రారంభమవుతుంది. దీని ఆఫర్ చివరి తేదీ అక్టోబర్ 5. ఈ నేపథ్యంలో ఎస్బిఐ క్రెడిట్ కార్డ్ హోల్డర్లకు ఏదైనా ఇ-కామర్స్ సైట్లో ఆన్లైన్ షాపింగ్ చేస్తే 10 శాతం క్యాష్ బ్యాక్ లభిస్తుందని ఎస్బిఐ కార్డ్ తెలిపింది.
10 శాతం క్యాష్బ్యాక్
కొనిగొలుదారులు వారి కొనుగోలుపై ఇప్పుడు 10 శాతం క్యాష్బ్యాక్ పొందవచ్చు. ఈ ఆఫర్ ఒకటి లేదా రెండు ఇ-కామర్స్ సైట్లలో కాదు అన్ని ఇ-కామర్స్ ప్లాట్ఫారమ్లలో అందుబాటులో ఉంటుంది. మొబైల్ ఫోన్లు, అసెసోరీస్, టీవీలు, పెద్ద అప్లియన్సెస్, ల్యాప్టాప్లు, టాబ్లెట్లు, గృహోపకరణాలు, వంటగది ఉపకరణాలు, ఫ్యాషన్ అండ్ లైఫ్ స్టయిల్, స్పొర్ట్స్, ఫిట్నెస్ మొదలైన వాటిపై క్యాష్బ్యాక్ పొందవచ్చు.
ఈఎంఐ లావాదేవీలపై కూడా
ఎస్బిఐ కార్డ్ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ సిఈఓ రామ్ మోహన్ రావు అమర మాట్లాడుతూ ఈ ఆఫర్ ద్వారా ఎప్పుడైనా కస్టమర్లకు అనుకూలమైన, అతుకులు లేని, సురక్షితమైన పేమెంట్ సొల్యుషన్స్ అందించడానికి ఎస్బిఐ కార్డ్ కట్టుబడి ఉందని చెప్పారు. ఈ రోజుల్లో ఈఎంఐ లావాదేవీలు కూడా వేగంగా పెరుగుతున్నాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని ఈ ఆఫర్ ఆన్లైన్ మర్చంట్ ఈఎంఐ లావాదేవీలకు కూడా అందుబాటులో ఉంటుంది అని అన్నారు. అయితే బీమా, యాత్రలు, వాలెట్, ఆభరణాలు, విద్య, ఆరోగ్యం, పౌర సేవలకు ఈ ఆఫర్ వర్తించదు అని కంపెనీ తెలిపింది.