వాహనదారులపై మరింత భారంగా ఇంధన ధరలు.. ఒకరోజు తరువాత నేడు మళ్ళీ పెంపు..

First Published Sep 30, 2021, 5:41 PM IST

 ఒక రోజు విరామం తర్వాత నేడు అంటే సెప్టెంబర్ 30న ఇంధన ధరలు మళ్లీ  పెరిగాయి. మెట్రో నగరాల్లోని దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్ ధర 25 పైసలు పెరిగి రూ. 101.64 కు చేరుకుంది, డీజిల్ ధరలు 20 పైసలు పెరిగి రూ .89.87 వద్ద చేరాయి.
 

ముంబైలో ఇంధన ధరలు ఇదే ధోరణిని కొనసాగించాయి. పెట్రోల్ ధర లీటరు రూ. 107.71కి పెరిగింది. ఫైనాన్షియల్ హబ్ ముంబై  మే 29న దేశంలో పెట్రోల్ లీటరుకు రూ .100 కంటే ఎక్కువగా విక్రయించబడుతున్న మొదటి మెట్రో నగరంగా అవతరించింది.
 


మహారాష్ట్ర రాజధానిలో ముంబైలో డీజిల్ ధర కూడా రూ. 97.21 నుండి రూ. 97.52 కి పెరిగింది. కోల్‌కతాలో లీటరు పెట్రోల్ రూ. 102.17గా, డీజిల్ ధర  రూ.92.97గా ఉంది. చెన్నైలో పెట్రోల్ ధర లీటరుకు రూ. 99.15 నుంచి రూ. 99.36కి పెరిగింది, డీజిల్ ధర రూ. 94.45గా ఉంది. పెట్రోల్, డీజిల్ ధరలు స్థానిక పన్నులను బట్టి రాష్ట్రం నుండి రాష్ట్రానికి భిన్నంగా ఉంటాయి.
 

సెప్టెంబర్ 28న పెట్రోల్ ధర  గత రెండు నెలల తరువాత మొదటిసారి పెరిగింది. డీజిల్ ధర సెప్టెంబర్ 24 నుండి నాలుసార్లు పెరిగింది.  ఇక అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు తగ్గాయి. బ్రెంట్ క్రూడాయిల్ ధర బ్యారెల్‌కు 0.46 శాతం తగ్గుదలతో 77.73 డాలర్లకు క్షీణించింది. డబ్ల్యూటీఐ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 0.28 శాతం క్షీణతతో 74.61 డాలర్లకు తగ్గింది.

సెప్టెంబర్ 24 నుండి డీజిల్ ధరలు లీటర్‌కు 95 పైసలు పెరిగాయి.  దీనికి ముంద డీజిల్ ధరను చివరిగా జూలై 15న పెంచారు. పెట్రోల్ ధర చివరి పెంపు జూలై 17న జరిగింది.

గత నెల జూలై, ఆగస్టులలో అంతర్జాతీయ చమురు ధరలు తగ్గినప్పుడు ఢిల్లీ మార్కెట్‌లో పెట్రోల్ రూ. 0.65, డీజిల్ రూ .1.25 రిటైల్ ధరలు తగ్గించబడ్డాయి. అంతకు ముందు మే 4 నుండి జూలై 17 మధ్య పెట్రోల్ ధర రూ .11.44 పెరిగింది. అలాగే  డీజిల్ ధర రూ. 9.14 పెరిగింది.

ఈ కాలంలో ధరల పెంపుతో  దేశంలోని సగానికి పైగా నగరాలలో  పెట్రోల్ ధరలు సెంచరీ దాటేశాయి. కొన్ని రాష్ట్రాల్లో డీజిల్ ధర లీటరుకు రూ.100 మార్క్ దాటింది. భారతదేశం దాదాపు 85 శాతం చమురు అవసరాలను తీర్చడానికి దిగుమతులపై ఆధారపడి ఉంది. హైదరాబాద్‌లో లీటరు పెట్రోల్ ధర  26 పైసలు పెరగడంతో రూ.105.74కు చేరింది. డీజిల్ ధర 32 పైసలు పెరుగుదలతో రూ.98.06కు ఎగసింది. 

click me!