ఏసీలు , 32 ఇంచ్ కన్నా పెద్దవైన టీవీలు, వాషింగ్ మెషిన్లు, మొబైల్ ఫోన్లు, కంప్యూటర్లపూ భారీగా ధరలు తగ్గవచ్చు. వీటి జీఎస్టీ 18 శాతానికి తగ్గించారు. దీని వల్ల గతం కన్నా ధరలు తగ్గుతాయి. అలాగే సిమెంట్, ఐస్ క్రీం, జ్యూస్, ప్యాక్ చేసిన ఆహారం, వస్త్రాలు వంటి వాటిపై కూడా 18 శాతం జీఎస్టీ పన్నును నిర్ణయించారు.
అలాగే బైక్లు, ఆటోలు, లారీలపై జీఎస్టీ 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గించారు. సెప్టెంబర్ 22 నుంచి కొత్త రేట్లు అమలులోకి రాబోతున్నాయి. మీరు ఈ వస్తువులైనా కొనాలనుకుంటే సెప్టెంబరు 22 తరువాత కొనడం ఉత్తమం.