ఇప్పుడు మహిళలు ఇంటి వద్ద ఉంటూనే, సక్సెస్ ఫుల్ గా రన్ చేసే వ్యాపారం గురించి తెలుసుకుందాం. తెలుగు వారి ఇంట భోజనం అంటే కంచంలో కచ్చితంగా ఉండాల్సిందే నిలవ పచ్చడి. ఆవకాయ, నిమ్మకాయ, ఉసిరికాయ, గోంగూర, పండు మిరపకాయ, అల్లం, టమాటో పచ్చళ్ళు అంటే తెలుగువారు ఎంతో ఇష్టంగా తింటారు. ప్రపంచంలో ఏ మూలకు వెళ్లినా తెలుగు వారు పచ్చళ్లను ప్యాక్ చేసి మరీ తీసుకొని వెళ్లి తింటారు. అంత డిమాండ్ ఉంటుంది. ప్రస్తుతం మార్కెట్లో ప్రియా, త్రీ మ్యాంగోస్, స్వస్తిక్ వంటి బ్రాండ్స్ పచ్చళ్లను పెద్ద ఎత్తున విక్రయిస్తున్నాయి.