బీఎస్ఎన్ఎల్ ఇప్పటి వరకు దేశంలో 90,000 4G టవర్లను ఏర్పాటు చేసింది. అందుకే ఈ ఆఫర్ క్రేజీగా మారింది. సిగ్నల్ ప్రాబ్లమ్ తీరడమే కాకుండా, మెరుగైన 4జీ నెట్వర్క్ ద్వారా వేగంగా ఇంటర్నెట్ కూడా లభించనుంది. ఈ ప్లాన్ రీఛార్జ్ చేసుకోవడానికి BSNL వెబ్సైట్, సెల్ఫ్ కేర్ యాప్ ఉపయోగించవచ్చు.
ఈ ఫ్లాష్ సేల్ జూన్ 28 నుండి జూలై 1, 2025 వరకు మాత్రమే ఉంటుందని సమాచారం. ఈ ఆఫర్లో రూ.400కే 400GB డేటా లభిస్తుంది. డేటా వోచర్లతో రీఛార్జ్ చేసుకునే వారికి ఇది వర్తిస్తుంది. ఈ ప్లాన్లో రూ.1కి 1GB డేటా లభిస్తుంది. ఇది హై స్పీడ్ 4G డేటా. డేటా 40 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది.