పోటీ కంపెనీలన్నీ 5G సేవలంటూ దూసుకుపోతుంటే.. బీఎస్ఎన్ఎల్ మాత్రం ప్రస్తుతం 4G సేవలను అందిస్తోంది. అయితే ప్రైవేటు నెట్వర్క్ కంపెనీలు కూడా కేవలం కొన్ని సిటీస్ లో మాత్రమే 5G సేవలు అందిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వాటిని పోటీనిస్తూ 4G సేవలు పూర్తి చేసిన వెంటనే 5G సేవలు ప్రారంభించాలని బీఎస్ఎన్ఎల్ ఆలోచిస్తోంది.
BSNL ఇప్పుడు 4G నెట్వర్క్ను బలోపేతం చేయడానికి దేశవ్యాప్తంగా మొబైల్ టవర్లను ఏర్పాటు చేస్తోంది. ఇప్పటికే 75,000 కొత్త 4G టవర్లు పని చేస్తున్నాయి. ఒకటి రెండు నెలల్లో ఇంకో 100,000 4G టవర్లు అందుబాటులోకి వస్తాయని సంస్థ వెల్లడించింది. దీనివల్ల BSNL 5G సేవను మొదలుపెట్టడానికి దారి ఏర్పడుతుంది.
జూన్లో BSNL 5G సేవలు ప్రారంభం
BSNL కోసం ఏర్పాటు చేసిన 100,000 4G టవర్లు 2025 మే నాటికి అందుబాటులోకి వస్తాయని కేంద్ర సమాచార శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఇటీవల ప్రకటించారు. ఆ తర్వాత 4G నుంచి 5Gకి మారడం జూన్లో మొదలవుతుందన్నారు. టెలికాం శాఖ (DoT) ఈ విషయాన్ని X ద్వారా తెలిపింది.
BSNLను బలోపేతం చేయడానికి గత సంవత్సరం కేంద్ర ప్రభుత్వం రూ.80,000 కోట్లు ఇచ్చింది. ఈ డబ్బుతో BSNL నెట్వర్క్ను స్ట్రాంగ్ చేస్తున్నారు. 4G, 5G కోసం నెట్వర్క్ను మెరుగు పరిచి, 3G సేవలను నిలిపి వేస్తున్నారు. ఇప్పుడు BSNL 4G సేవలు దేశంలోని అన్ని ప్రాంతాల్లో లభిస్తున్నాయి.
ఇది కూడా చదవండి జియో పూర్తిగా ఫ్రీ.. వొడాఫోన్ ఇస్తున్న బంపర్ ఆఫర్ అదిరిపోయిందిగా..
BSNL బడ్జెట్ ప్లాన్
మరిన్ని టవర్లు పెట్టి 4Gని పెంచడానికి బీఎస్ఎన్ఎల్ కంపెనీ ప్రయత్నాలు చేస్తోంది. నెట్వర్క్ బాగుంటే ప్రైవేట్ టెలికాం వినియోగదారులు కూడా BSNLకి మారతారు. గత జూలైలో ప్రైవేట్ కంపెనీలు రీఛార్జ్ ధరలు పెంచడంతో చాలామంది BSNLకి మారారు. గత ఏడాది జూలై, సెప్టెంబర్ నెలల్లో లక్షల మంది ఒక్కసారిగా BSNLకి మారారు.
BSNL రీఛార్జ్ ప్లాన్స్ ప్రైవేట్ కంపెనీల కంటే తక్కువ ధరలో ఉంటాయి. ఇప్పట్లో రీఛార్జ్ ధరలు పెంచే ఆలోచనలో BSNL లేదు. 4G నెట్వర్క్ తెచ్చి 5G సేవలు తెస్తే BSNLకి ఎక్కువ మంది వస్తారు.