జీతాలు పొందే వారికి, పెన్షనర్లకు ఆర్‌బి‌ఐ గుడ్ న్యూస్.. ఎన్‌ఏ‌సి‌హెచ్ లభ్యతపై కీలక ప్రకటన

First Published Jun 4, 2021, 4:44 PM IST

న్యూ ఢీల్లీ: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) జీతాలు, పెన్షనర్ల కోసం భారీ ప్రకటన చేసింది. ఈ ఏడాది ఆగస్టు 1 నుంచి నేషనల్ ఆటోమేటెడ్ క్లియరింగ్ హౌస్ (ఎన్‌ఏ‌సి‌హెచ్) సర్వీస్ రోజుకు 24 గంటల పాటు,  వారంలోని ఏడు రోజులు పనిచేయనున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) శుక్రవారం ప్రకటించింది.  
 

నేషనల్ ఆటోమేటెడ్ క్లియరింగ్ హౌస్ (ఎన్‌ఏ‌సి‌హెచ్) అంటే ఏమిటి?ఎన్‌ఏ‌సి‌హెచ్ అనేది ఎన్‌పి‌సి‌ఐచే నిర్వహించబడే భారీ పేమెంట్ సిస్ట. డివిడెండ్ చెల్లింపు, వడ్డీ, జీతం, పెన్షన్ మొదలైనవి ఒకటి నుండి అనేక క్రెడిట్ బదిలీలను సులభతరం చేస్తుంది. అలాగే విద్యుత్, గ్యాస్, టెలిఫోన్, వాటర్, లోన్ ఇన్స్టాల్ మెంట్ వాయిదాలు, మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడులు, భీమా ప్రీమియం మొదలైనవి కూడా ఉన్నాయి.
undefined
"ఎన్‌ఏ‌సి‌హెచ్ పెద్ద సంఖ్యలో లబ్ధిదారులకు ప్రత్యక్ష ప్రయోజన బదిలీ (డిబిటి) పాపులర్ అండ్ ప్రోమినెంట్ మోడ్ లోఉద్భవించింది. ప్రస్తుత కోవిడ్-19 వ్యాప్తి సమయంలో ప్రభుత్వ రాయితీలను సకాలంలో, పారదర్శకంగా బదిలీ చేయడానికి ఎన్‌ఏ‌సి‌హెచ్ సహాయపడింది. కస్టమర్ సౌలభ్యాన్ని మరింత పెంచడానికి అలాగే ఆర్‌టి‌జి‌ఎస్ 24x7 లభ్యతపై ప్రభావం చూపడానికి, ప్రస్తుతం బ్యాంక్ పని దినాలలో అందుబాటులో ఉన్న నాచ్, 2021 ఆగస్టు 1 నుండి అమల్లోకి వచ్చే వారంలోని అన్ని రోజులలో అందుబాటులో ఉంచాలని ప్రతిపాదించింది "అని ఆర్‌బి‌ఐ తెలిపింది.
undefined
ఈ అన్ని చర్యలకు సంబంధించిన సూచనలు సర్క్యులర్లు విడిగా జారీ చేయబడతాయని ఆర్‌బి‌ఐ తెలిపింది.రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎప్పటిలాగే నేడు రేపో రేటును 4 శాతానికి మార్చకుండా నిర్ణయించింది.
undefined
ఆర్‌బిఐ గవర్నర్ శక్తికాంత దాస్ నేతృత్వంలోని ద్రవ్య విధాన కమిటీ (ఎంపిసి) యథాతథంగా రేపో రేటును కొనసాగించడం వరుసగా ఆరోసారి. వడ్డీ రేటును చారిత్రాత్మక కనిష్టానికి తగ్గించడం ద్వారా డిమాండ్‌ను పెంచడానికి ఆఫ్‌-పాలసీ సైకిల్ లో ఆర్‌బిఐ చివరిగా 2020 మే 22న పాలసీ రేటును సవరించింది.
undefined
click me!