విజయ్ మాల్యాకి లండన్‌ కోర్టులో ఎదురుదెబ్బ.. భారతీయ బ్యాంకులకు అనుకూలంగా తీర్పు..

First Published Jul 27, 2021, 5:15 PM IST

భారత వ్యాపారవేత్త విజయ్ మాల్యా (65)పై యు.కె హైకోర్టు సోమవారం దివాలా ఉత్తర్వులు జారీ చేసింది.  దీంతో ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ విజయ్ మాల్య రూ .6,200 కోట్ల రుణానికి జప్తుగా రూ.14,000 కోట్ల విలువైన తన ఆస్తులను జతచేస్తున్నట్లు తెలిపింది. 

ఈ‌డికి డబ్బు తిరిగి ఇవ్వవలసి ఉన్నందున బ్యాంకులు తనను దివాళా తీస్తున్నాయని విజయ్ మాల్యా ఆరోపణలు చేశారు. భారతీయ బ్యాంకులకు వేల కోట్ల రూపాయల రుణాలు ఎగవేసి విదేశాలకు పారిపోయిన వ్యాపారవేత్త విజయ్‌ మాల్యా అప్పగింత కేసును సోమవారం విచారించిన లండన్ హైకోర్టు తీర్పును ప్రకటించింది.
undefined
రూ .6,200 కోట్ల రుణాలకి బదులుగా ప్రభుత్వ బ్యాంకుల ఆదేశాల మేరకు 14 కోట్ల విలువైన నా ఆస్తులను ఇడి అటాచ్ చేసింది. ఈ‌డికి డబ్బు తిరిగి ఇవ్వవలసి ఉన్నందున నన్ను దివాళా తీయమని బ్యాంకులు కోర్టును కోరుతున్నాయి. ”అని మాల్యా సోమవారం ఒక ట్వీట్‌లో పేర్కొన్నారు.
undefined
మేలో జరిగిన ఒక వర్చువల్ హియరింగ్ సందర్భంగా లండన్ హైకోర్టు బ్యాంకుల దివాలా పిటిషన్‌ను సవరించాలని ఎస్‌బిఐ నేతృత్వంలోని రుణదాత కన్సార్టియం ఇచ్చిన దరఖాస్తును యుకే కోర్టు సమర్థించింది. ఈ మేరకు లండన్ హైకోర్టు చీఫ్ ఇన్సాల్వెన్సీ అండ్ కంపెనీస్ కోర్ట్ (ఐసిసి) న్యాయమూర్తి మైఖేల్ బ్రిగ్స్ బ్యాంకులకు అనుకూలంగా తీర్పునిచ్చారు.
undefined
ఇదిలావుండగా విదేశాంగ కార్యదర్శి హర్ష్ వర్ధన్ ష్రింగ్లా దీనిపై స్పందిస్తు విజయ్ మాల్యా ఆర్థిక నేరాలకు పాల్పడటంపై భారతదేశం కేసు పెట్టిందని ఆర్ధిక మోసం, మని లాండరింగ్ ఆరోపణలను ఎదురుకొంటున్న విజయ్ మాల్యాని భారత్ అప్పగించెందుకు భారత అధికారులకు యుకె అధికారుల నుండి హామీ ఉందని అన్నారు.
undefined
సోమవారం ఈ ఉత్తర్వులను అనుసరించి విజన్ మాల్యా న్యాయవాది ఫిలిప్ మార్షల్ ఈ ఉత్తర్వును వాయిదా వేయాలని కోరినప్పటికీ దివాలా ఉత్తర్వుకు వ్యతిరేకంగా అప్పీల్ చేయడానికి అనుమతి కోరుతూ దాఖలు చేసిన పిటీషన్‌ను న్యాయమూర్తి నిరాకరించారు.
undefined
click me!