ఏటీఎంలలో నగదు లభ్యం కాకపోవడంపై అనేక ఫిర్యాదుల నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బిఐ) ఇటీవల పరిస్థితిని అంచనా వేసింది. దీని ఆధారంగా ఈ రూల్ రూపొందించారు. ఒక నెలలో పది గంటలకు పైగా ఏటిఎంలో నగదు కొరత ఉంటే ఆ బ్యాంకుకు జరిమానా విధించాలని ఆర్బిఐ ఆదేశించింది. అంటే ఇప్పుడు ఏటీఎంలలో క్యాష్ అందుబాటులో లేకపోతే రూ.10,000 జరిమానా విధించబడుతుంది.