Apple iPhone : లారీలు, ట్రక్కుల్లో కాదు... విమానాల్లో యాపిల్ ఐపోన్స్ లోడింగ్, ఎందుకో తెలుసా?

Published : Apr 07, 2025, 03:54 PM ISTUpdated : Apr 07, 2025, 04:02 PM IST

వస్తువులను ఎక్కువగా లారీలు, ట్రక్కుల్లో రవాణా చేయడం చూస్తుంటాం... అంతర్జాతీయ స్థాయిలో అయితే షిప్పుల్లో రవాణా చేస్తారు. ఇలా రోడ్డు, జల రవాణా వల్ల ఖర్చులు తగ్గి తక్కువ ధరకే ఆ వస్తువులు మార్కెట్లో లభిస్తాయి. కానీ ప్రస్తుతం యాపిల్ ఐపోన్స్ ను విమానాల్లో రవాణా చేస్తున్నారు. యాపిల్ వస్తువుల ధరలు పెరగకుండా ఉండేందుకే ఇలా ఆకాశంలో రవాణా చేస్తున్నారట. విమానాల్లో యాపిల్ వస్తువుల రవాణాకు కారణమేంటో తెలుసా? 

PREV
13
Apple iPhone : లారీలు, ట్రక్కుల్లో కాదు... విమానాల్లో యాపిల్ ఐపోన్స్ లోడింగ్, ఎందుకో తెలుసా?
Apple iPhone

Apple iPhone : పొట్టోన్ని పొడుగోడు కొడితే.... పొడుగోన్ని పోచమ్మ కొట్టిందట... ఈ సామెత తాజాగా అమెరికన్ కంపనీ యాపిల్ చర్యలకు సరిగ్గా సరిపోతుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇతర దేశాలపై భారీగా సుంకాలు విధిస్తుంటే... ఓ అమెరికన్ కంపనీ మాత్రం ట్రంప్ కే దెబ్బేస్తోంది. అమెరికా విధించిన భారీ సుంకాలనుండి తప్పించుకునేందుకు ఆ దేశానికే చెందిన దిగ్గజ కంపనీ యాపిల్ భారీ ప్లాన్ ను అమలుచేసింది. సొంత దేశం అమెరికాకే దిమ్మతిరిగేలా కౌంటర్ ఇస్తోంది యాపిల్. 

23
Apple Products

అసలు యాపిల్ ఏం చేసింది?   

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రపంచ దేశాలపై భారీగా దిగుమతి సుంకాలు విధించిన విషయం తెలిసిందే. అత్యధికంగా చైనాపై 52%, తైవాన్ పై 32% టారీఫ్స్ విధించారు... ఇండియాపై కూడా 26% టారీప్స్ విధించారు. అంటే ఇలా వివిధ దేశాలనుండి దిగుమతి అయ్యే వస్తువులపై పెంచిన సుంకాలను వసూలు చేయనుంది అమెరికా. ఇలా తమ దేశంపై ఏదేశం ఏ స్థాయిలో సుంకాలు విధిస్తుందో అదేస్థాయిలో టారీఫ్స్ విధిస్తున్నారు ట్రంప్. ఈ ప్రతికార సుంకాలు అంతర్జాతీయ మార్కెట్ పై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. 

అయితే ట్రంప్ సర్కార్ విధించిన దిగుమతి సుంకాలు విదేశీ కంపనీలకే కాదు అమెరికన్ కంపనీలకు వర్తిస్తాయి. విదేశాల్లో తయారయ్యే సొంతదేశం కంపనీ వస్తువులపై కూడా సుంకాలు కట్టాలి. ఇది ప్రముఖ మొబైల్ ఫోన్స్ ఐఫోన్ తయారీ సంస్థ యాపిల్ పై తీవ్ర ప్రభావం చూపనుంది. యాపిల్ కంపనీ భారత్ తో పాటు చైనాలో తయారీ ప్లాంట్స్ కలిగివుంది... కాబట్టి ఇక్కడినుండి అమెరికాకు తరలించే ఐఫోన్లు వాటి విడిభాగాలపై భారీగా పన్నులు చెల్లించాల్సి ఉంటుంది.  

అధిక పన్నుల నుండి తప్పించుకునేందుకు యాపిల్ సంస్థ సొంత దేశాన్నే బోల్తా కొట్టించింది. అమెరికా విధించిన సుంకాలు ఏప్రిల్ 9 నుండి అమల్లోకి రానున్నాయి. ఆలోపే భారత్, చైనాలో తయారైన యాపిల్ ఉత్పత్తులను అమెరికాకు తరలిస్తోంది సదరు సంస్థ. ఇప్పటికే ఐదు విమానాలు ఐఫోన్లతో పాటు వివిధ యాపిల్ ఉత్పత్తులను అమెరికాకు చేరుకున్నట్లు తెలుస్తోంది. ఇందులో భారత్ నుండి 3, చైనా నుండి 2 విమానాలు యాపిల్ వస్తువులతో తరలివెళ్లాయి. 

33
Apple iPhones

యాపిల్ ఐఫోన్స్ ధరలు పెరుగుతాయా?  

అమెరికాలో ట్రంప్ సర్కార్ తీసుకుంటున్న నిర్ణయాలు విదేశీ కంపనీలపైనే కాదు యాపిల్ వంటి స్వదేశీ కంపనీలపై కూడా తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. సుంకాల పెంపు నిర్ణయంతో యాపిల్ ఐఫోన్లతో పాటు ఇతర ఉత్పత్తుల ధరలు భారీగా పెరిగే అవకాశం ఉంటుంది. అయితే ఇప్పట్లో ధరలపెంపు ఉండదని యాపిల్ సంస్థ చెబుతోంది.  

ప్రస్తుతం ధరల పెరుగుదలను నివారించడానికే యాపిల్ సంస్థ విదేశాల్లోని యూనిట్స్ లో తయారయ్యే వస్తువులను స్వదేశానికి చేరవేస్తోంది. దిగుమతి సుంకాలు అమలయ్యే లోపు వీలైనన్ని ఎక్కువ ప్రోడక్ట్స్ అమెరికాకు తరలించేందుకు ప్రత్యేక విమానాలను ఉపయోగిస్తోంది. ఇలా యాపిల్ లోడ్స్ భారత్, చైనా నుండి గాల్లో ఎగురుతున్నాయి. ఇలా తరలిస్తున్న ప్రోడక్ట్స్ ను నిల్వ చేయడానికి గిడ్డంగులను ఉపయోగిస్తున్నారు. 

ఏప్రిల్ 9వ తేదీకి ముందు షిప్ చేయబడిన ఉత్పత్తులకు పాత పన్ను వర్తిస్తాయి... కాబట్టి ప్రస్తుతానికి కొత్త పన్నుల నుండి తప్పించుకోవచ్చని యాపిల్ కంపెనీ భావిస్తోంది. కానీ ఇకపై విదేశాల్లో తయారయ్యే యాపిల్ ఉత్పత్తులపై భారీ సుంకాలు పడనున్నాయి. కాబట్టి ఇప్పుడు కాకున్నా తర్వాతైనా యాపిల్ ఐపోన్లతో పాటు ఇతర ఉత్పత్తుల ధరలు భారీగా పెరిగే అవకాశాలున్నాయి. 
 

Read more Photos on
click me!

Recommended Stories