అనిల్ అంబానీ కుటుంబం ప్రస్తుతం నివాసం ఉంటున్న ముంబైలోని ఇంటితో పాటు ఆయన గ్రూపుకు చెందిన ఎన్నో నివాసాలు, వాణిజ్య ఆస్తులను కూడా అటాచ్ చేసింది ఈడీ. అతనికి హైదరాబాదులోని సోమాజిగూడులో కామస్ కాప్రి అపార్ట్మెంట్స్ లో రెండు లగ్జరీ ఫ్లాట్లు ఉన్నాయి. వాటిని కూడా జప్తు చేయాల్సిన ఆస్తులు జాబితాలో పెట్టింది. అలాగే ఆంధ్రప్రదేశ్లో తూర్పుగోదావరి జిల్లాలో కూడా కొన్ని స్థిరాస్తులు ఉన్నాయి. వాటిని కూడా అటాచ్ చేసింది. వీటితో పాటు ముంబై, నోయిడా, థానే, ఢిల్లీ, పూణే, చెన్నై, ఘజియాబాద్ లో ఉన్న స్థిరాస్తులను కూడా జప్తు చేస్తున్నట్టు ప్రకటించింది.