నివేదికల ప్రకారం ఎయిర్ ఇండియా దాదాపు 70,000 కోట్ల నష్టాలను కూడగట్టుకుంది అంతేకాదు ప్రభుత్వం ప్రతిరోజూ దాదాపు రూ.20 కోట్లు నష్టపోతోంది. ఎయిర్ ఇండియాను విక్రయించడానికి నరేంద్ర మోడీ ప్రభుత్వం చేసిన రెండవ ప్రయత్నం ఇది.
కేంద్రం 2018 మార్చిలో ఎయిర్ ఇండియాలో 76 శాతం వాటాను విక్రయించడానికి మొదట ప్రయత్నం చేసింది, కానీ పెరుగుతున్న అప్పులకు సంబంధించిన ఆందోళనల మధ్య ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు.
ఎయిర్ ఇండియాకి ఇప్పటికీ దేశీయ విమానాశ్రయాలలో 4,400 డోమస్టిక్, 1800 అంతర్జాతీయ ల్యాండింగ్ అండ్ పార్కింగ్ స్లాట్లు, విదేశాలలో 900 స్లాట్లను నియంత్రిస్తుంది.