2020లో భారత్, చైనాలు ఘర్షణ వాతావరణం ప్రారంభమైనప్పటి నుంచి చైనా కంపెనీలపై భారత్ ఒత్తిడి పెంచింది. రెండు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నందున టెన్సెంట్ హోల్డింగ్స్ లిమిటెడ్ వీచాట్, బైట్డాన్స్ లిమిటెడ్ కు చెందిన టిక్ టాక్ యాప్ తో సహా 300కి పైగా యాప్లను భారత్ నిషేధించింది. అదే సమయంలో దేశీయ స్మార్ట్ ఫోన్ తయారీ దారులు లావా, మైక్రోమ్యాక్స్ వంటి కంపెనీలు మన మార్కెట్లో స్మార్ట్ఫోన్ అమ్మకాల్లో సగం కంటే తక్కువ వాటాను కలిగి ఉండటం గమనార్హం.