న్యూ వెహికల్ స్క్రాప్ పాలసీ: ఇప్పుడు కొత్త వాహనం రిజిస్ట్రేషన్ ఫ్రీ, అలాగే ఈ 5 లాభాలను తెలుసుకోండి

First Published Aug 13, 2021, 7:18 PM IST

 భారతదేశ ప్రధాని నరేంద్ర మోదీ నేడు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నేషనల్ ఆటోమొబైల్ స్క్రాపింగ్ పాలసీని ప్రారంభించారు. ఈ విధానం దేశంలో సానుకూల మార్పును తీసుకొస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థకు మొబిలిటీ ఒక పెద్ద అంశం, అలాగే ఆర్థికాభివృద్ధికి కూడా ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. 

ఈ సమావేశాన్ని కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ, గుజరాత్ ప్రభుత్వం నిర్వహించాయి. ఇందులో పెట్టుబడిదారులు, పరిశ్రమ నిపుణులు, కేంద్ర అలాగే రాష్ట్ర ప్రభుత్వాల సంబంధిత మంత్రిత్వ శాఖలు పాల్గొన్నారు. ప్రభుత్వం ఇప్పటికే పార్లమెంటులో స్క్రాప్ విధానాన్ని ప్రకటించింది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా బడ్జెట్‌లో స్క్రాప్ విధానం గురించి ప్రస్తావించారు.

ప్రధాని మోదీ ప్రసంగంలోని ముఖ్యమైన అంశాలు

కొత్త స్క్రాపింగ్ విధానం వేస్ట్ టు వెల్త్ అనే మంత్రాన్ని ముందుకు తీసుకెళుతుంది. రాబోయే 25 సంవత్సరాలు దేశానికి చాలా ముఖ్యమైనవి, టెక్నాలజీ మారుతున్న విధానాన్ని బట్టి మనం కూడా మారాలి. మనము వాతావరణ మార్పుల సవాలును కూడా ఎదుర్కొంటున్నాము, కాబట్టి పెద్ద చర్యలు తీసుకోవడం అవసరం.

ఈ విధానం ద్వారా సాధారణ కుటుంబాలు అన్ని విధాలుగా ఎంతో ప్రయోజనం పొందుతాయి. మొదటి ప్రయోజనం ఏమిటంటే పాత వాహనాన్ని స్క్రాప్ చేయడంపై సర్టిఫికేట్ ఇవ్వబడుతుంది. ఈ సర్టిఫికెట్ ఉన్నవారు కొత్త వాహనం కొనుగోలుపై రిజిస్ట్రేషన్ కోసం ఎలాంటి డబ్బు చెల్లించాల్సిన అవసరం లేదు.
దీనితో పాటు, సర్టిఫికేట్ పొందిన వారికి రోడ్డు పన్నులో కొంత మినహాయింపు కూడా పొందుతారు. 

రెండవ ప్రయోజనం ఏమిటంటే, పాత వాహనం నిర్వహణ ఖర్చులు, మరమ్మత్తు ఖర్చు, ఇంధన సామర్థ్యం కూడా ఆదా అవుతుంది.

మూడవ ప్రయోజనం నేరుగా జీవితానికి సంబంధించినది. పాత వాహనాలు పాత టెక్నాలజీ కారణంగా రోడ్డు ప్రమాదానికి గురయ్యే ప్రమాదం చాలా ఎక్కువ, ఒక విధంగా ఇది  వాహనదారులకు భారీ ఉపశమనం ఇస్తుంది. 

నాల్గవ ప్రయోజనం ఏమిటంటే  కాలుష్యం మన ఆరోగ్యంపై చూపే ప్రభావాన్ని కూడా తగ్గిస్తుంది. ఈ విధానం దేశంలోని నగరాలలో కాలుష్యాన్ని తగ్గించడంతో పాటు పర్యావరణాన్ని పరిరక్షించడంతో పాటు అభివృద్ధి చేయాలనే మా వాగ్దానాన్ని ప్రతిబింబిస్తుంది. నేడు ఒక వైపు భారతదేశం డీప్ ఓషన్ మిషన్ ద్వారా కొత్త అవకాశాలను అన్వేషిస్తోంది. మరోవైపు ఆర్థిక వ్యవస్థను ప్రోత్సహిస్తోంది.  

500 ఫిట్‌నెస్ కేంద్రాలు

ఈ  సమావేశంలో కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ మాట్లాడుతూ వాహన స్క్రాప్ విధానం ప్రకారం వాహనాలకు ఫిట్‌నెస్ టెస్ట్ తప్పనిసరి ఉంటుంది. దీని కోసం పబ్లిక్-ప్రైవేట్ పార్టనర్‌షిప్ (పిపిపి) పద్ధతిలో దేశవ్యాప్తంగా 400 నుండి 500 వాహన ఫిట్‌నెస్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. అలాగే  60 నుండి 70 రిజిస్టరేడ్ స్క్రాపింగ్ కేంద్రాలు రానున్నాయి. 

click me!